News February 11, 2025
యాదాద్రిలో శ్రీవారి ఆదాయం రూ.22,60,628

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. ప్రధాన బుకింగ్, వీఐపీ, బ్రేక్ దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణ కట్ట, వ్రతాలు, యాద ఋషి నిలయం, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, అన్నదాన విరాళాలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.22,60,628 ఆదాయం వచ్చిందని ప్రకటించారు.
Similar News
News December 10, 2025
ఓటు హక్కు వినియోగానికి 18 రకాల కార్డులు: కలెక్టర్

ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 18 రకాల ధ్రువపత్రాల్లో దేనినైనా ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎలక్షన్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, పోస్ట్ ఆఫీస్/బ్యాంకు పాస్ బుక్, పాన్ కార్డు, ఇండియన్ పాస్పోర్ట్, ఫొటోతో కూడిన కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు.
News December 10, 2025
గర్భంలోని బిడ్డకు HIV రాకూడదంటే..

హెచ్ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇలాకాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోని ద్వారా వైరస్ సంక్రమించే అవకాశాలుంటాయి. కాబట్టి సీ సెక్షన్ చేయించడం మంచిది. పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్ఐవీ మందులు వాడటం వల్ల వైరస్ బిడ్డకు సోకి ఉంటే నాశనమవుతుంది.
News December 10, 2025
భవానీ దీక్షల విరమణ.. భద్రత కట్టుదిట్టం: సీపీ

విజయవాడ భవానీ దీక్షల విరమణ కార్యక్రమాల నేపథ్యంలో సీపీ రాజశేఖర్ బాబు హోల్డింగ్ ఏరియాలు, సీసీ కెమెరాల ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరుగనున్న దీక్షా విరమణ, మహా పూర్ణాహుతి దృష్ట్యా బందోబస్తుకు వచ్చిన అధికారులకు విధులపై దిశానిర్దేశం చేశారు. సీతమ్మ వారి పాదాల వద్ద, మున్సిపల్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన హోల్డింగ్ ఏరియాలను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు.


