News February 11, 2025
యాదాద్రిలో శ్రీవారి ఆదాయం రూ.22,60,628

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. ప్రధాన బుకింగ్, వీఐపీ, బ్రేక్ దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణ కట్ట, వ్రతాలు, యాద ఋషి నిలయం, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, అన్నదాన విరాళాలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.22,60,628 ఆదాయం వచ్చిందని ప్రకటించారు.
Similar News
News November 25, 2025
పిల్లల కోసం ‘బాల భరోసా’.. త్వరలో ప్రారంభం!

TG: ఆరోగ్య సమస్యలున్న 0-5ఏళ్లలోపు పిల్లలకు ఉచిత చికిత్స అందించేందుకు ప్రభుత్వం ‘బాల భరోసా’ పథకాన్ని తీసుకొస్తోంది. CM రేవంత్ త్వరలో దీనిని ప్రారంభిస్తారని సమాచారం. అంగన్వాడీ, ఆశా వర్కర్లు పిల్లల చూపు, వినికిడి, ప్రవర్తన వంటి 42 అంశాలపై ఇంటింటి సర్వే చేశారు. 18లక్షల మంది డేటా సేకరించగా 8 లక్షల మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. చికిత్సతో ఈ సమస్యల్ని పోగొట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
News November 25, 2025
ఆంజనేయుడే కాదు.. ఆయన తోక కూడా అంతే శక్తిమంతమైనది..

నారద పురాణం ప్రకారం.. ఆజన్మ బ్రహ్మచారి హనుమాన్ లాంగూలం(తోక) సాక్షాత్తు రుద్రుడి రూపమని చెబుతారు. అందుకే ఆయన తోకను కూడా పూజిస్తే కష్టాలు కానరాకుండా పోతాయని నమ్ముతారు. ‘పూర్వం, భీముడు కూడా ఆయన తోకను కదపలేకపోయాడు. తులసీదాస్ ‘హనుమాన్ బాహుక్’ స్తోత్రంతో హనుమ లాంగూల స్పర్శను కోరి తన బాధలను పోగొట్టుకున్నారు. లాంగూల స్తోత్ర పఠనం రోగాలు, కష్టాలను తగ్గించి శాంతిని ప్రసాదిస్తుంది’ అని పండితులు చెబుతారు.
News November 25, 2025
మలేషియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు SM బ్యాన్

16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా (SM) వాడకుండా నిషేధం విధించాలని మలేషియా నిర్ణయించింది. 2026లో ఇది అమల్లోకి రానుంది. సైబర్ నేరాలు, ఆన్లైన్ బెదిరింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ పిల్లలు SM వాడితే పేరెంట్స్కు ఫైన్ వేయాలని భావిస్తోంది. కాగా టీనేజర్లకు DEC నుంచి SMను నిషేధిస్తామని ఇటీవల ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇండియాలోనూ ఇలాంటి రూల్ అమలు చేయాలంటారా?


