News March 22, 2025
యాదాద్రిశుడీ నిత్యాదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శుక్రవారం 950 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.47,500, ప్రసాద విక్రయాలు రూ.6,09,614, VIP దర్శనాలు రూ.1,20,000, బ్రేక్ దర్శనాలు రూ.96,900, కార్ పార్కింగ్ రూ.2,12,500, వ్రతాలు రూ.60,000, యాదరుషి నిలయం రూ.50,426, లీజెస్ రూ.5,88,745, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.27,68,585 ఆదాయం వచ్చింది.
Similar News
News November 18, 2025
ANU: మాస్టారూ… ఇదేం క్వశ్చన్ పేపర్? నివ్వెరపోయిన స్టూడెంట్స్!

నాగార్జున వర్సిటీ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం మళ్లీ బయటపడింది. ఇవాళ జరిగిన MSC 3rd సెమిస్టర్ పరీక్షలో నమూనా పత్రాలనే అసలు ప్రశ్నాపత్రాలుగా పంపిణీ చేయడంతో విద్యార్థులు నివ్వెరపోయారు. చేతితో రాసిన ప్రశ్నలను ప్రింట్ చేసి ఇవ్వడం, సూచనలు-నియమావళి లేకపోవడం ఆశ్చర్యపోయేలా చేసింది. మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. కాగా గతంలో పేపర్ లీకేజీకి కారణమైన వ్యక్తే.. ఇందుకు కారణమని సమాచారం.
News November 18, 2025
ANU: మాస్టారూ… ఇదేం క్వశ్చన్ పేపర్? నివ్వెరపోయిన స్టూడెంట్స్!

నాగార్జున వర్సిటీ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం మళ్లీ బయటపడింది. ఇవాళ జరిగిన MSC 3rd సెమిస్టర్ పరీక్షలో నమూనా పత్రాలనే అసలు ప్రశ్నాపత్రాలుగా పంపిణీ చేయడంతో విద్యార్థులు నివ్వెరపోయారు. చేతితో రాసిన ప్రశ్నలను ప్రింట్ చేసి ఇవ్వడం, సూచనలు-నియమావళి లేకపోవడం ఆశ్చర్యపోయేలా చేసింది. మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. కాగా గతంలో పేపర్ లీకేజీకి కారణమైన వ్యక్తే.. ఇందుకు కారణమని సమాచారం.
News November 18, 2025
‘U’ టైప్ దాడుల్లో సిద్ధహస్తుడు హిడ్మా!

గెరిల్లా దాడులకు పెట్టింది పేరైన మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్నోసార్లు భద్రతా బలగాలను బోల్తా కొట్టించాడు. కూంబింగ్ సమయంలో బలగాలను చుట్టూ కొండలు ఉండి మధ్యలో లోతైన ప్రదేశానికి వచ్చేవరకు ఎదురుచూసేవాడు. ఆ తర్వాత మూడు వైపులా(U ఆకారంలో) మావోలను మోహరించి కాల్పులు చేయిస్తాడు. ముందు వైపు ఎత్తైన కొండలు ఉండటంతో బలగాలు తప్పించుకోవడానికి కష్టంగా మారేది. ఇలాంటి సమయాల్లో బలగాల ప్రాణనష్టం అధికంగా ఉండేది.


