News March 22, 2025
యాదాద్రిశుడీ నిత్యాదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శుక్రవారం 950 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.47,500, ప్రసాద విక్రయాలు రూ.6,09,614, VIP దర్శనాలు రూ.1,20,000, బ్రేక్ దర్శనాలు రూ.96,900, కార్ పార్కింగ్ రూ.2,12,500, వ్రతాలు రూ.60,000, యాదరుషి నిలయం రూ.50,426, లీజెస్ రూ.5,88,745, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.27,68,585 ఆదాయం వచ్చింది.
Similar News
News October 13, 2025
మంచిర్యాల: కీటక జనిత వ్యాధులపై అవగాహన

జిల్లాలోని ప్రభావిత మండలాల్లో 20 బృందాల ద్వారా ఫైలేరియాని నిర్ధారణ కోసం రాపిడ్ టెస్టులను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య అధికారి డా.అనిత చెప్పారు. మంచిర్యాల మండలం తాళ్లపేట పీహెచ్సీలో సర్వేలో పాల్గొంటున్న బృందాలతో సమీక్ష నిర్వహించారు. కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగీ, చికెన్ గునియా, ఫైలేరియా వ్యాధులపై ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. దోమలు కుట్టకుండా, వృద్ధి చెందకుండా చూడాలన్నారు.
News October 13, 2025
నిర్మల్: గుర్తుతెలియని మృతదేహం..

నిర్మల్ జిల్లా జనరల్ ఆసుపత్రి మార్చురీలో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 8న ఉదయం 11 గంటలకు ఈ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుడిచేతిపై ‘మామ్ డాడ్’ అని పచ్చబొట్టు ఉందని తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు వెంటనే తమను సంప్రదించాలని కోరారు.
News October 13, 2025
అనకాపల్లి జిల్లాలో 1.30 లక్షల గుంబూషియా చేపలు విడుదల

గుంబూషియా చేపలతో దోమలను నియంత్రించవచ్చునని డీఆర్ఓ సత్యనారాయణరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో గల కొలనులో గుంబూషియా చేపలను విడుదల చేశారు. జిల్లాలో ఎంపిక చేసిన 295 నీటి నిల్వ కేంద్రాలు, చెరువులు,కొలనులు బావుల్లో 1.30 లక్షల గుంబూషియా చేపలను విడుదల చేసినట్లు తెలిపారు. యాంటీ లార్వా ఆపరేషన్ లో ఈ చేపలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇవి నీటిలో లార్వాను పూర్తిగా తినేస్తాయన్నారు.