News March 22, 2025
యాదాద్రిశుడీ నిత్యాదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శుక్రవారం 950 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.47,500, ప్రసాద విక్రయాలు రూ.6,09,614, VIP దర్శనాలు రూ.1,20,000, బ్రేక్ దర్శనాలు రూ.96,900, కార్ పార్కింగ్ రూ.2,12,500, వ్రతాలు రూ.60,000, యాదరుషి నిలయం రూ.50,426, లీజెస్ రూ.5,88,745, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.27,68,585 ఆదాయం వచ్చింది.
Similar News
News April 20, 2025
కొత్త ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్!

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే సిమెంట్ అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై సిమెంట్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కంపెనీలతో ఒప్పందం కుదిరిన తర్వాత మార్కెట్ రేటుతో పోలిస్తే తక్కువ ధరకే లబ్ధిదారులకు సిమెంట్ అందజేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ఈ నెల 30లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే.
News April 20, 2025
కరీంనగర్: JEE మెయిన్స్ ఫలితాల్లో శ్రీ చైతన్య సత్తా

JEE మెయిన్స్-2025 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు M.రోహిత్ 17, T.కుందన్ 814, P.ఈశ్వర్ ముఖేష్ 1275, M. అంజలి 2575, B. అక్షర 2992, M. తరుణ్ 5949, G. నందిని 7464 ర్యాంకులు సాధించారు. 20వేల లోపు 15 మంది విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించగా.. పరీక్షకు హాజరైనవారిలో 40% మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లితండ్రులను చైర్మన్ రమేష్ రెడ్డి అభినందించారు.
News April 20, 2025
ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఈనెల 21న(సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ దృష్ట్యా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కావు,న జిల్లాకు చెందిన ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. వచ్చే సోమవారం యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు.