News January 30, 2025
యాదాద్రి: అయోమయంలో రేషన్ కార్డు దరఖాస్తుదారులు

యాదాద్రి జిల్లావ్యాప్తంగా ఇటీవల జరిగిన ప్రజాపాలన సభల్లో కేవలం రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల పేర్లు మాత్రమే చదివి వినిపించారు. అందులో అర్హులైన వారు ఎవరు అనేది వెల్లడించకపోవడంతో దరఖాస్తుదారులు అయోమయంలో పడ్డారు. ఈ నెల 26 న జిల్లా వ్యాప్తంగా కేవలం 17 గ్రామాల్లో 910 మంది లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులు జారీ చేయడంతో మిగతా వారు తమకు కార్డులు ఎప్పుడోస్తాయో అని ఎదురుచూస్తున్నారు.
Similar News
News November 17, 2025
జగిత్యాల: శీతాకాలం.. జిల్లావాసులకు SP సూచనలు

శీతాకాలం మొదలైనందున రహదారులపై పొగమంచు ఎక్కువగా ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.
1. వేగం తగ్గించాలి
2. ఫాగ్లైట్లు- లో బీమ్ ఉపయోగించాలి
3. ముందున్న వాహనానికి దూరం పాటించాలి
4. ఓవర్టేక్ చేయరాదు
5. రోడ్డుపై వాహనాలు నిలపకూడదు
6. హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అని SP కోరారు.
News November 17, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
* మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
* వైజాగ్ స్టీల్ప్లాంట్పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కార్మికులు ఆందోళనకు దిగారు. మెటీరియల్ సరఫరా చేయకుండా ప్రభుత్వ వైఫల్యాలను తమపై మోపడం సరికాదన్నారు.
News November 17, 2025
సౌదీ ప్రమాదంలో భారతీయులు చనిపోవడం బాధాకరం: మోదీ

సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మదీనాలో జరిగిన ఈ ఘటనలో భారత పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రియాద్లోని భారత రాయబార కార్యాలయం & జెడ్డాలోని కాన్సులేట్ సాధ్యమైనంత సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. సౌదీ అధికారులతో సమీక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.


