News January 30, 2025

యాదాద్రి: అయోమయంలో రేషన్ కార్డు దరఖాస్తుదారులు

image

యాదాద్రి జిల్లావ్యాప్తంగా ఇటీవల జరిగిన ప్రజాపాలన సభల్లో కేవలం రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల పేర్లు మాత్రమే చదివి వినిపించారు. అందులో అర్హులైన వారు ఎవరు అనేది వెల్లడించకపోవడంతో దరఖాస్తుదారులు అయోమయంలో పడ్డారు. ఈ నెల 26 న జిల్లా వ్యాప్తంగా కేవలం 17 గ్రామాల్లో 910 మంది లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులు జారీ చేయడంతో మిగతా వారు తమకు కార్డులు ఎప్పుడోస్తాయో అని ఎదురుచూస్తున్నారు. 

Similar News

News December 1, 2025

తిరుమలలో సహస్ర నామార్చన ఆంతర్యం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో తోమాలసేవ తర్వాత జరిగే ముఖ్య కైంకర్యం సహస్ర నామార్చన. ఇందులో స్వామివారిని 1008 నామాలతో పూజిస్తారు. ఈ నామాల ద్వారా శ్రీమహావిష్ణువు సకల వైభవాలను కీర్తిస్తారు. సకల దుఃఖాలను తొలగించేది, శుభాలను ప్రసాదించేది శ్రీమహావిష్ణువే అనే భావనతో ఈ అర్చన జరుగుతుంది. భక్తులు ఆర్జితసేవ టికెట్ల ద్వారా ఈ పవిత్రమైన అర్చనలో పాల్గొని, స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 1, 2025

NINలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్‌(NIN)లో 3 ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-3, 2 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. బీఎస్సీ(నర్సింగ్, న్యూట్రీషన్, డైటెటిక్స్, హోమ్ సైన్స్, పబ్లిక్ హెల్త్ న్యూట్రీషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు mmp_555@yahoo.comకు దరఖాస్తును పంపాలి. projectsninoutsourcing@gmail.comలో సీసీ పెట్టాలి. వెబ్‌సైట్: https://www.nin.res.in

News December 1, 2025

ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి: శ్రీకాకుళం కలెక్టర్

image

ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్‌ఎస్‌కే) ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించి, ప్రభుత్వం ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.