News March 19, 2025

యాదాద్రి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనుల పక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్  

image

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల నిర్మాణాల పనుల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. మంగళవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీవోలతో ఇందిరమ్మ ఇళ్లకు, తాగు నీరు, పన్ను వసూళ్లు, ఎల్అర్ఎస్‌లపై అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలసి మండలాల వారిగా సమీక్షించారు. 

Similar News

News December 21, 2025

తాడేపల్లిగూడెం: మోపెడ్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

image

పెదతాడేపల్లి సమీపంలోని వెల్లమిల్లి స్టేజ్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిపూడి పెద్దిరాజు మృతి చెందారు. వెల్లమిల్లిలో పని ముగించుకుని కొమ్ముగూడెం వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన లారీ వీరి మోపెడ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పెద్దిరాజు గాయాలతో చికిత్స పొందుతూ కన్నుమూయగా, మోపెడ్ నడుపుతున్న చెల్లయ్య తలకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 21, 2025

2,322 ఉద్యోగాలు.. BIG UPDATE

image

TG: రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 2,322 ఉద్యోగాలకు గతేడాది నవంబర్ 23న నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అభ్యర్థుల మార్కులు, ర్యాంకుల జాబితాను సిద్ధం చేసినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. పని అనుభవం కలిగిని వారికి వెయిటేజీ పాయింట్లను కలిపి మెరిట్ రూపొందించినట్లు పేర్కొన్నాయి.

News December 21, 2025

కామారెడ్డి జిల్లాలో మాంసం ధరలు

image

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం మటన్, చికెన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మటన్ కిలో రూ.800, చికెన్ కిలో రూ.250, లైవ్ కోడి కిలో రూ.150 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. చికెన్, మటన్ గత వారం ధరలే ఈ వారం కూడా కొనసాగుతున్నాయి.