News February 15, 2025

యాదాద్రి: ఎక్కడ చూసినా అదే చర్చ..!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్గొండ – ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News October 30, 2025

GWL: ‘నర్సింగ్ కాలేజీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి’

image

గద్వాలలో రూ.33.02 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కాలేజీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ మందిరంలో నర్సింగ్ కాలేజీ, విద్యార్థి వసతి గృహ ఏర్పాట్ల పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నవంబర్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే రూ.130 కోట్లతో వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేస్తారని తెలిపారు.

News October 30, 2025

బెల్లంపల్లి ఏరియాలో సీఎంఓ పర్యటన

image

బెల్లంపల్లి ఏరియా గోలేటి, మాదారం చీఫ్ మెడికల్ అధికారి కిరణ్ రాజు గురువారం పర్యటించారు. ఏరియా ఆసుపత్రిలో వసతులు, ల్యాబ్‌లను తనిఖీ చేశారు. నిత్యం ఎంత మంది ఉద్యోగులు చికిత్స కోసం వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. పునరావాస కాలనీల్లో మొబైల్ హెల్త్ క్యాంప్ ద్వారా అందించే వైద్య సేవలను కొనసాగించాలని పేర్కొన్నారు.

News October 30, 2025

రాయికల్: ‘రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు’

image

జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా వరి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత సూచించారు. రాయికల్ మండలం అల్లీపూర్, సింగారావుపేట, జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామాల్లోని ప్యాక్స్, ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. రైతుల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.