News February 13, 2025
యాదాద్రి: ఎన్నికల బరిలో 22 మంది!

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల బరిలో 22 అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 10వ తేదీతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం ముగిసింది. ఈనెల 11న నామినేషన్ల పరిశీలనలో 23అభ్యర్థులకు గాను ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో 13న నామినేషన్ల ఉపసంహరణ పర్వం సైతం ముగిసింది.
Similar News
News December 18, 2025
రేషన్ కార్డుదారులు e-KYC తప్పనిసరి: DSO

రేషన్ కార్డుదారులందరికీ e-KYC తప్పనిసరి అని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ సూచించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన లబ్ధిదారులందరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. రేషన్ డీలర్లు షాపులను తెరిచి ఉంచి, తమ పరిధిలోని కార్డుదారులందరితో 100 శాతం e-KYC చేయించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు దీనిపై పూర్తి అవగాహన కల్పించి, గడువులోగా ప్రక్రియ ముగిసేలా చూడాలని స్పష్టం చేశారు.
News December 18, 2025
రేవంత్ రెడ్డి పతనానికి సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం: హరీష్రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు 40 శాతం సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడం సీఎం రేవంత్ రెడ్డి పతనానికి నిదర్శనమని హరీష్ రావు విమర్శించారు. మెదక్లో గెలుపొందిన నూతన సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు బీఆర్ఎస్కే అండగా నిలిచారని, రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
News December 18, 2025
సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

సుక్మా జిల్లా పరిధిలోని గొండిగూడలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళ మావోయిస్టుతో సహా ముగ్గురు మృతి చెందారు. సుక్మా పోలీసుల వివరాలు.. గొండిగూడ అడవుల్లో మావోలు ఉన్నారన్న సమాచారం మేరకు కూంబింగ్ నిర్వహించామన్నారు. జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఏసీఎం ర్యాంకు, ఒక ఎల్ఓఎస్ సభ్యురాలు మృతి చెందారన్నారు. వారి వద్ద 9 ఎంఎం సర్వీస్ పిస్టల్, 12 బోర్, బార్మర్ గన్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.


