News March 9, 2025
యాదాద్రి: ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ ఫైనల్..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ కోటాలో ఆయన పేరును ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, శంకర్ నాయక్కు మిర్యాలగూడ, హుజూర్నగర్, నాగార్జున సాగర్ గిరిజన తండాల్లో పట్టుంది. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News April 11, 2026
ఏపీలో 6 జోన్లు.. లిస్ట్ ఇదే

AP: ఉద్యోగాల కల్పనకు సంబంధించి రాష్ట్రంలోని 4 జోన్లను క్యాబినెట్ 6 జోన్లుగా మార్చింది. రెండు మల్టీ జోన్లను మూడుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
Z1: SKLM, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి
Z2: అల్లూరి, తూ.గో, కాకినాడ, కోనసీమ
Z3: ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా
Z4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు
Z5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప
Z6: నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి
News April 11, 2026
కేజీబీవీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు: డీఈవో

జిల్లాలోని కేజీబీవీలో 2026-27 ఏడాదికి 6,7,8,9,10, ఇంటర్మీడియట్లో ప్రవేశాల దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. రేపటితో ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం పేర్కొన్నారు.
News April 11, 2026
పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల భర్తీకి JANలో ఇచ్చిన 28,636 పోస్టుల భారీ నోటిఫికేషన్ <


