News February 19, 2025

యాదాద్రి కలెక్టర్‌కు ఆహ్వాన పత్రిక అందజేత

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బంగారు విమాన గోపురం మహా కుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ హనుమంతరావును యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Similar News

News July 6, 2025

ఈనెల 10న మెగా పేరెంట్స్&టీచర్స్ సమావేశం

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈనెల 10న మెగా పేరెంట్&టీచర్స్ సమావేశంపై శనివారం సాయంత్రం కలెక్టర్ శ్యాం ప్రసాద్ వివరించారు. ప్రజా ప్రతినిధులు, పాఠశాల కమిటీలు, పదోతరగతిలో ఉత్తమ ర్యాంకర్‌లు, పూర్వ విద్యార్థులు, తదితరులతో కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం కార్యాచరణ చేస్తోందని వెల్లడించారు. అంతా తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

News July 6, 2025

బిర్యానీ అంటే.. అదో ఎమోషన్!

image

‘వరల్డ్ బిర్యానీ డే’ ఒకటుందని తెలుసా? జులైలో తొలి ఆదివారాన్ని బిర్యానీ డేగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమందికి బిర్యానీ అనేది ఒక ఎమోషన్. ఇది పర్షియా నుంచి ఉద్భవించిందని, మొఘలులు భారత్‌కు తెచ్చారని నమ్ముతారు. ఇందులో హైదరాబాదీ బిర్యానీ, లక్నో, కోల్‌కతా అంటూ చాలానే రకాలున్నాయి. వీటికి అదనంగా ఫ్రై పీస్, ఉలవచారు అంటూ మనోళ్లు చాలానే కనిపెట్టారు. మరి.. మీకే బిర్యానీ ఇష్టం? COMMENT చేయండి.

News July 6, 2025

సింహాచలం గిరి ప్రదక్షిణకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

image

గిరి ప్రదక్షిణ రూట్లో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసు కమిషనర్ శంఖ‌బ్రత బాగ్చి తెలిపారు. 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గిరి ప్రదక్షణలో పాల్గొనే భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు నిర్దేశిత ప్రాంతాలను గుర్తించామని తెలిపారు.