News March 28, 2025
యాదాద్రి కొండపై శ్రీరామనవమి వేడుకలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 9 వరకు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. అందులో ప్రధాన ఘట్టాలు ఏప్రిల్ 5న ఎదుర్కోళ్ల మహోత్సవం, 6న కళ్యాణ మహోత్సవం, 7న సీతారాముల పట్టాభిషేకం, 8న శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, 9న ఉత్సవాలకు స్వస్తి పలకనున్నారు.
Similar News
News April 17, 2025
వనపర్తి: ‘ఉపాధ్యాయుల సంక్షేమం PRTU TSతోనే సాధ్యం’

ఉపాధ్యాయుల హక్కుల సాధన, సంక్షేమం PRTU TSతోనే సాధ్యమని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో PRTU TS గౌరవ అధ్యక్షుడు శివకుమార్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తక్షణమే PRC ఇప్పించే ఏర్పాటు, 2003 DSC వారికి పాత పెన్షన్ను ఇప్పించడం, పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లుల క్లియరెన్స్ చేస్తామన్నారు.
News April 17, 2025
వనపర్తి: ‘పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి’

వేతనాల పెండింగ్, ఉద్యోగ భద్రత లాంటి ప్రధాన సమస్యలపై నిరసనగా ఏప్రిల్ 17న వనపర్తిలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మె నిర్వహించారు. పాలిటెక్నిక్ మైదానంలో ప్రారంభమైన ర్యాలీ పాత కలెక్టర్ ఆఫీస్ వద్ద ముగిసింది. TUCI జిల్లా అధ్యక్షుడు పి.అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. జీవో 60 ప్రకారం జీతాలు, పెండింగ్ వేతనాల చెల్లింపు, ESI, PF, ఇన్సూరెన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News April 17, 2025
పెద్దపల్లి: 15 రోజుల వ్యవధిలో ఇద్దరు మిత్రులు మృతి

పెద్దపల్లి జిల్లా సర్కిల్ విద్యుత్ శాఖలో 15రోజుల వ్యవధిలో ఇద్దరు సబ్ స్టేషన్ ఆపరేటర్లు మృతి చెందారు. ఈ నెల 3న సబ్ స్టేషన్ ఆపరేటర్ రాజ్ కుమార్ పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ అద్దె ఇంట్లో అనుమానాస్పదకంగా మృతిచెందాడు. జీడికే పీజీ సెంటర్ సబ్ స్టేషన్లో పని చేస్తున్న సామల రవి గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా వీరిద్దరు గతంలో ముంజంపల్లి సబ్ స్టేషన్లో 10 ఏళ్లు కలిసి పని చేశారు.