News February 18, 2025
యాదాద్రి: గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 5:30 గంటలకు ప్రదక్షిణ స్వామివారి కొండ కింద ప్రధాన(పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచుల రిజర్వేషన్లు అధికారికంగా ఖరారయ్యాయి.
మొత్తం 260 పంచాయతీలు ఉండగా..
63 జనరల్,
58 జనరల్ మహిళ..
29 బీసీ జనరల్,
24 బీసీ మహిళ..
32 ఎస్సీ జనరల్,
24 ఎస్సీ మహిళ..
17 ఎస్టీ జనరల్,
13 ఎస్టీ మహిళ స్థానాలుగా నిర్ణయించారు. మొత్తం మీద 121 పంచాయతీలు జనరల్ అభ్యర్థులకు, బీసీలకు 53, ఎస్సీలకు 56, ఎస్టీలకు 30 పంచాయితీలు దక్కనున్నాయి.
News November 24, 2025
మహబూబాబాద్: 482 జీపీల్లో బీసీలకు 24 స్థానాలే!

జిల్లాలో 18 మండలాల్లో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా సర్పంచ్ రిజర్వేషన్ స్థానాల్లో బీసీలకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. మహబూబాబాద్- 1, కేసముద్రం -2, తొర్రూర్-6, పెద్ద వంగర- 3, నర్సింహులపేట-6, చిన్నగూడూర్ -1, నెల్లికుదురు -4, దంతాలపల్లి- 3 మొత్తం బీసీలకు 24 జీపీల్లోనే రిజర్వేషన్ స్థానాలను అధికారులు కేటాయించారు.
News November 24, 2025
స్థానిక ఎన్నికల తేదీలపై 25న క్యాబినెట్ నిర్ణయం!

TG: కోర్టుల ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల్లో 50%లోపు రిజర్వేషన్లను ఖరారు చేశారు. పంచాయతీల రిజర్వేషన్లపై ఇవాళ కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వులను బట్టి షెడ్యూలు, నోటిఫికేషన్ విడుదలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మూడు దశల్లో నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ నెల 25న జరిగే మంత్రివర్గ భేటీలో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది.


