News March 17, 2025
యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం గిరిప్రదక్షిణ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.
Similar News
News March 18, 2025
చిత్తూరు: పాఠశాల పని వేళల్లో మార్పు

పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో పని వేళలను మార్పు చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 1 నుంచి 5 వరకు పాఠశాలలు నడపాలని గతంలో ఇచ్చిన ఉత్తర్లను మార్పు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి 5 వరకు పని వేళలను మార్పు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ పని వేళల్లో పాఠశాలలు నిర్వహించాలని సూచించారు.
News March 18, 2025
భువనగిరి: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా కూలీ బిడ్డ

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు రామన్నపేట(M) వెల్లంకికి చెందిన బలికె తరుణ్ కుమార్. రాష్ట్రంలో TGPSC సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. TGలో 32, 5వ జోనల్లో 5 ర్యాంక్ సాధించాడు. ప్రభుత్వ లైబ్రరీలో చదువుకుంటూ ఈ ఘనత అందుకున్నాడు. తండ్రి నర్సింహా ముంబైలో వలస కార్మికుడిగా, తల్లి మహేశ్వరీ గ్రామంలో కూలీ పని చేస్తున్నారు. అతనికి స్నేహితులు సహకారం అందించారు.
News March 18, 2025
కృష్ణా జిల్లాలో పేర్ల మార్పు రాజకీయం

కృష్ణా జిల్లాలో పేరు మార్పుల రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జగన్ హయాంలో NTR యూనివర్సిటీని YSR యూనివర్సిటీగా మార్చగా, కూటమి ప్రభుత్వం తిరిగి NTR పేరునే పెట్టింది. ఇప్పుడు YSR తాడిగడపను తాడిగడపగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా NTR స్వగ్రామమైన నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉండగా దీనికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.