News March 17, 2025
యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం గిరిప్రదక్షిణ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
స్థల సమస్య ఉన్న ప్రాంతాలపై నివేదిక ఇవ్వండి: కలెక్టర్

ఆసుపత్రి భవనాల నిర్మాణానికి స్థల సమస్య ఉన్న ప్రాంతాలపై కాటారం సబ్ కలెక్టర్, భూపాలపల్లి ఆర్డీవోకు నివేదికలు అందచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పంచాయతీ రాజ్, టీజీఈడబ్ల్యూఐడీసీ, ప్రణాళిక శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతి, నిధుల వినియోగంపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
News December 3, 2025
WNP: డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డి.. పత్రం అందజేత

వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన శివసేనారెడ్డి బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో నియామక పత్రాన్ని అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఆయన ఈ పత్రాన్ని స్వీకరించారు. జిల్లాలో అందరి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేస్తానని శివసేనారెడ్డి పేర్కొన్నారు.
News December 3, 2025
త్వరలో 40వేల ఉద్యోగాల భర్తీ: రేవంత్

TG: 2023 DEC 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని CM రేవంత్ అన్నారు. ‘శ్రీకాంతాచారి బలిదానం కూడా ఇదేరోజు జరిగింది. ఆయన స్ఫూర్తితో 60వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. మరో 40వేల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని హుస్నాబాద్ సభలో ప్రకటించారు. 2001లో ఈ ప్రాంతం నుంచే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని 2004లో కరీంనగర్లో సోనియా ప్రత్యేక రాష్ట్రంపై మాటిచ్చారన్నారు.


