News February 1, 2025
యాదాద్రి జిల్లాలో నూతనంగా 2 పంచాయతీలు..!

యాదాద్రి జిల్లాలో నూతనంగా ఏడు పంచాయతీలను ఏర్పాటు చేస్తు గత ఆగస్టులో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా అప్పుడు గుర్జవానికుంట, ఇందిరానగర్ పెండింగ్లో ఉండగా.. నిన్న గ్రామపంచాయతీలకు అనుమతిస్తూ గెజిట్ విడుదల చేసింది. దీంతో జిల్లాలో పంచాయతీల సంఖ్య 428కి చేరాయి.
Similar News
News December 3, 2025
ఈ నెల 6 నుంచి ANU యువజన ఉత్సవాలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా 2025-2026 యువజన ఉత్సవాలు ఈనెల 6, 7, 8 తేదీలలో జరుగుతాయని యువజన ఉత్సవాల కోఆర్డినేటర్ మురళీమోహన్ తెలిపారు. మ్యూజిక్, డాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ వంటి అంశాలలో పోటీలు ఉంటాయని చెప్పారు. వర్సిటీలోని కళాశాలలతో పాటు, అనుబంధ కళాశాల విద్యార్థులు యువజన ఉత్సవాల్లో పాల్గొనాలని సూచించారు.
News December 3, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పట్టనున్న మహార్దశ

రూ.5,000 కోట్లతో NHలు, రూ.4,000 కోట్లతో రైల్వే లైనుతో ఉమ్మడి KNR జిల్లా ప్రయాణికులకు మహార్దశ పట్టనుంది. JGTL-KNR వరకు 58.60 KMల మేర 4 లైన్ల విస్తరణకు రూ.2484 కోట్లు, JGTL-MNCL వరకు 62.29 KMల మేర 4 లైన్ల విస్తరణకు రూ.2548 మంజూరు కాగా ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి. ఇక రామగుండం-మణుగూరు రైల్వే లైన్ కు రూ.4 వేల కోట్లు మంజూరయ్యాయి. మంథని-కాటారం-మేడారం-తాడ్వాయి-MNGR వరకు రైల్వేప్రయాణం సౌకర్యం ఏర్పడనుంది.
News December 3, 2025
TODAY HEADLINES

⋆ చేనేత, పవర్ లూమ్స్కు ఫ్రీ కరెంట్ : CM CBN
⋆ పదేళ్లు అధికారమిస్తే రాష్ట్రాన్ని నం.1 చేస్తాం: CM రేవంత్
⋆ పవన్ కళ్యాణ్ ‘దిష్టి’ వ్యాఖ్యలపై TG మంత్రుల ఆగ్రహం.. వ్యాఖ్యలను వక్రీకరించొద్దన్న జనసేన
⋆ TG: ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
⋆ పీఎంవో పేరు ‘సేవాతీర్థ్’గా మార్పు
⋆ రెండు దశల్లో జనగణన: కేంద్రం
⋆ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదు: కేంద్రం


