News February 1, 2025
యాదాద్రి జిల్లాలో నూతనంగా 2 పంచాయతీలు..!

యాదాద్రి జిల్లాలో నూతనంగా ఏడు పంచాయతీలను ఏర్పాటు చేస్తు గత ఆగస్టులో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా అప్పుడు గుర్జవానికుంట, ఇందిరానగర్ పెండింగ్లో ఉండగా.. నిన్న గ్రామపంచాయతీలకు అనుమతిస్తూ గెజిట్ విడుదల చేసింది. దీంతో జిల్లాలో పంచాయతీల సంఖ్య 428కి చేరాయి.
Similar News
News February 13, 2025
గౌలిదొడ్డి: JEEలో గౌలిదొడ్డి విద్యార్థుల ప్రభంజనం

RR జిల్లా గౌలిదొడ్డి గురుకుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు JEE అడ్వాన్స్ పరీక్షలో ప్రభంజనం సృష్టించారు. 99.03 పర్సంటైల్ సాధించి మణిదీప్ అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చరణ్ తేజ్, తేజస్విని, రామ్చరణ్, శ్రీనివాస్, భాను తేజ, నేహాలత, నిహారిక టాప్ ర్యాంకులు సాధించినట్లు రెసిడెన్షియల్ అధికారులు తెలిపారు. ఒకే పాఠశాల నుంచి ఇంత మంది టాప్ ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు.
News February 13, 2025
పరిశ్రమల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష

పరిశ్రమల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ గురువారం ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మీనాక్షి కంపెనీ (వేదాంత పవర్), సింహపురి జిందాల్ కంపెనీ, నవయుగ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతినిధులు తెలిపిన పలు సమస్యలపై చర్చించి పరిష్కార దిశగా మార్గాలపై దిశానిర్దేశం చేశారు.
News February 13, 2025
MTM: వల్లభనేని వంశీ అరెస్ట్.. ఎస్పీ కీలక ప్రకటన

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర రావు కీలక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్- 30 అమలులో ఉన్న నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలు పూర్తిగా నిషేధమన్నారు. పోలీసుల నిషేధాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.