News September 1, 2024

యాదాద్రి: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్

image

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కారణంగా యాదాద్రి జిల్లాలో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందని జిల్లా కలెక్టర్ హనుమంత్ తెలిపారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే తప్ప బయటకి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే స్థానిక మండల తహసీల్దార్‌ను, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08685-293312 ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News November 20, 2025

NLG: పైలట్ ప్రాజెక్టుగా 70 గ్రామాలు ఎంపిక!

image

నల్గొండ జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రభుత్వం భూభారతిలో పక్కాగా హద్దులు తేల్చేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా సర్వే కోసం జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసింది. అందులో 8,627 సర్వేనెంబర్‌ల పరిధిలో 72,758.7 ఎకరాల భూమిని సర్వే చేసి లెక్కలు తేల్చనున్నారు. రెసిడెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ద్వారా సర్వే జరిపి అనంతరం ఆ వివరాలను భూభారతి పోర్టల్‌లో అప్లోడ్ చేయనున్నారు.

News November 19, 2025

ముగిసిన కోట మైసమ్మ ఆలయ జాతర

image

నిడమనూరు మండల పరిధిలోని కోట మైసమ్మ ఆలయ జాతర మంగళవారం ముగిసింది. మూడో రోజు సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. అంతకముందు భక్తులు బోనాలు సమర్పించారు. జిల్లా నుంచే కాకుండా మహబూబ్‌నగర్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చినట్లు ఈవో సిరికొండ నవీన్ కుమార్ తెలిపారు.

News November 19, 2025

ముగిసిన కోట మైసమ్మ ఆలయ జాతర

image

నిడమనూరు మండల పరిధిలోని కోట మైసమ్మ ఆలయ జాతర మంగళవారం ముగిసింది. మూడో రోజు సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. అంతకముందు భక్తులు బోనాలు సమర్పించారు. జిల్లా నుంచే కాకుండా మహబూబ్‌నగర్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చినట్లు ఈవో సిరికొండ నవీన్ కుమార్ తెలిపారు.