News March 19, 2025

యాదాద్రి టెంపుల్ బోర్డు స్వరూపమిదే..

image

TTD తరహాలో యాదాద్రిలో పాలక మండలి బోర్డు (YTD) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. YTDకి రెండేళ్ల పదవీ కాలం ఉండనుంది. బోర్డులో 18 మంది సభ్యులుంటారు. బోర్డు ఛైర్మన్, సభ్యులకు జీతాలు ఉండవు. టీటీడీ బోర్డు మాదిరిగానే వైటీడీ బోర్డుకు ఐఏఎస్ అధికారి ఈఓగా ఉంటారు. ఫౌండర్ ట్రస్టీ, MLA లేదా MLC, SC, ST, BC సభ్యులతో పాటు మరో నలుగురు సభ్యులుంటారు. మిగిలిన వారిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.

Similar News

News November 16, 2025

అల్లు అర్జున్-బోయపాటి కాంబోలో మూవీ?

image

అల్లు అర్జున్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాలో నటిస్తున్నారు. ఈ షూటింగ్ అనుకున్నదానికంటే ముందే పూర్తయ్యే ఛాన్స్ ఉండటంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరో ప్రాజెక్టును చేపట్టాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే బోయపాటితో చర్చలు జరిగాయని సమాచారం. వీరిద్దరి కాంబోలో గతంలో సరైనోడు మూవీ వచ్చింది.

News November 16, 2025

జగిత్యాల: కేజీబీవీలో నైట్ వాచ్ ఉమెన్ పోస్టు ఖాళీ

image

జగిత్యాల ధరూర్ క్యాంపులోనికేజీబీవీలో ఖాళీగా ఉన్న నైట్ వాచ్ ఉమెన్ పోస్టు కోసం అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని అర్బన్ మండల విద్యాధికారి చంద్రకళ తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణత అర్హతగా పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 17 నుంచి 19 వరకు జగిత్యాల కేజీబీవీలో దరఖాస్తులను సమర్పించాలని కోరారు. సెక్యూరిటీ ఏజెన్సీలలో శిక్షణ పొందిన మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆమె వివరించారు.

News November 16, 2025

నగరంలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

image

HYD పరిసరాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. GHMC పరిధిలోని యూనివర్సిటీ ఆఫ్ HYDలో 10 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా BHEL 11.4, రాజేంద్రనగర్ 11.9, శివరాంపల్లి 12.2, గచ్చిబౌలి 12.5 డిగ్రీల సెల్సియస్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ముక్కు, చెవుల్లోకి చల్లగాలి వెళ్లకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉపిరి తీసుకోవడంలో సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి.