News June 13, 2024

యాదాద్రి: ట్రాన్స్ఫార్లు, ప్రమోషన్ల కోసం 2130 మంది అప్లికేషన్లు

image

యాదాద్రి జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్​కలిపి 712 స్కూల్స్​ఉన్నాయి. వీటిల్లో 3,465 టీచర్​పోస్టులు ఉండగా 2,800 మంది పనిచేస్తున్నారు. వీరిలో 2,130 మంది ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల కోసం అప్లయ్​ చేసుకున్నారు. వారి సర్వీస్​రిజిస్ట్రర్లను​ ఆఫీసర్లు పరిశీలించి ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లకు సంబంధించి లెక్కలు తేల్చనున్నారు. జిల్లాలో163 మంది గెజిటెడ్​హెడ్మాస్టర్లకు 75 మంది పని చేస్తున్నారు.

Similar News

News March 25, 2025

నేరస్థులకు శిక్ష పడేలా చూడాలి: నల్గొండ ఎస్పీ

image

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు అభినందన సభ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. గడిచిన సంవత్సర కాలంలో ఒకరికి ఉరి, 17 మందికి జీవిత ఖైదు విధించడం జరిగిందని తెలిపారు. నిందితులను దోషులుగా నిరూపించి శిక్షలు పడేలా చేయాలని కోరారు. కోర్టు అధికారులు ప్రాసిక్యూటర్ల సమన్వయంతో న్యాయ సలహాలు అడిగి పనిచేయాలన్నారు. నిందితులను సకాలంలో కోర్టులో హాజరుపరచాలన్నారు.

News March 25, 2025

నల్గొండ: మరొకరికి మంత్రి పదవి!

image

మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి చోటు కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది. ఇటీవల అద్దంకి దయాకర్‌ను MLC పదవి వరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే SRPTకి చెందిన రమేశ్ రెడ్డిని పర్యాటక శాఖ ఛైర్మన్‌గా నియమించింది. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులుగా ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారు. దీంతో ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యం పెరిగినట్లైంది. జిల్లాకు మరో అమాత్య యోగముందా కామెంట్ చేయండి.

News March 25, 2025

ఉమ్మడి NLG జిల్లా నుంచే సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం

image

రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఉగాది పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్ నగర్‌లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్ల పనులు చకచకా జరుగుతున్నాయి. ఫణిగిరి గుట్టకు వెళ్లే రోడ్డులో సీఎం సభ ప్రాంగణం ఏర్పాటు చేయనున్నారు.

error: Content is protected !!