News April 4, 2025

యాదాద్రి: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.

Similar News

News April 8, 2025

సిరికొండ: కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి: కలెక్టర్

image

కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు చేర్చాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మంగళవారం ఆయన సిరికొండ మండలం చిన్నవాల్గోట్ గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటనే అన్ లోడ్ చేసుకుంటున్నారా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.

News April 8, 2025

పరామర్శకు వచ్చి జేజేలా?.. జగన్‌పై సునీత ఫైర్

image

AP: పరామర్శలకు ఎలా వెళ్లాలో కూడా మాజీ CM జగన్‌కు తెలియదని TDP MLA పరిటాల సునీత ఎద్దేవా చేశారు. జై జగన్ అంటూ పరామర్శకు వెళ్తారా అని ఆమె ప్రశ్నించారు. ‘పరిటాల కుటుంబాన్ని రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడుతున్నారు. పోలీసులపై ఇష్టానుసారంగా మాట్లాడటం ఏంటి? జగన్ ఒక MLA మాత్రమే. ఒక DSP, 10 మంది పోలీసులు ఆయన పర్యటనకు సరిపోతారు. వైసీపీ నేత లింగమయ్య హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ఆమె స్పష్టం చేశారు.

News April 8, 2025

పెద్దపల్లి: సోలార్ విద్యుత్‌పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలోని ప్రజలకు పీఎం సూర్య ఘర్ పథకంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం సోలార్ విద్యుత్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ పథకం క్రింద ప్రజలు స్వచ్ఛందంగా ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. కిలో వాట్‌కు రూ.30 వేలు, 2 కేడబ్ల్యూకు రూ.60 వేలు, 3 కేడబ్ల్యూకు రూ.78 వేల సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందన్నారు.

error: Content is protected !!