News April 4, 2025

యాదాద్రి: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.

Similar News

News November 18, 2025

ఫోన్ పోయిన వెంటనే ఫిర్యాదు చేయాలి: ASF ఎస్పీ

image

మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారు వెంటనే CEIR వెబ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ASF జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. మంగళవారం ASF ఎస్పీ కార్యాలయంలో సెయిర్ వెబ్ పోర్టల్ ద్వారా స్వాధీనం చేసుకున్న 41 మొబైల్ ఫోన్లను బాధితులకి అప్పగించారు. ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది తప్పనిసరి వస్తువు అయిందన్నారు. ప్రతి చిన్న పనితో పాటు యూపీఐ లావాదేవీలకి సైతం మొబైల్ ప్రధానమన్నారు.

News November 18, 2025

ఫోన్ పోయిన వెంటనే ఫిర్యాదు చేయాలి: ASF ఎస్పీ

image

మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారు వెంటనే CEIR వెబ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ASF జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. మంగళవారం ASF ఎస్పీ కార్యాలయంలో సెయిర్ వెబ్ పోర్టల్ ద్వారా స్వాధీనం చేసుకున్న 41 మొబైల్ ఫోన్లను బాధితులకి అప్పగించారు. ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది తప్పనిసరి వస్తువు అయిందన్నారు. ప్రతి చిన్న పనితో పాటు యూపీఐ లావాదేవీలకి సైతం మొబైల్ ప్రధానమన్నారు.

News November 18, 2025

‘బాపట్ల జిల్లాలో రైతులకు రూ.26.98 కోట్ల ఆర్థిక సహాయం’

image

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. ఈనెల 19న జరిగే ఈ కార్యక్రమాన్ని అన్ని స్థాయిలలో ఆధికారులు సమన్వయంతో నిర్వహించాలన్నారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో ప్రసార ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 1.60 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.26.98 కోట్ల ఆర్థిక సహాయం జమ కానుందని తెలిపారు.