News April 4, 2025

యాదాద్రి: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.

Similar News

News November 28, 2025

ఖమ్మం: తీగల వంతెన పనులకు జూన్ వరకు గడువు

image

ఖమ్మం నగరానికి కొత్త అందాలను తెచ్చేందుకు రూ.180 కోట్ల వ్యయంతో మున్నేరు నదిపై నిర్మిస్తోన్న తీగల వంతెన నిర్మాణ పనులు 60 శాతం పూర్తయ్యాయి.వర్షాలు,వరదల కారణంగా పనులకు అంతరాయం కలగడంతో, పూర్తి గడువును వచ్చే మార్చి నుంచి జూన్ వరకు పొడిగించినట్లు ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు. వంతెన పూర్తయితే శిథిలావస్థలో ఉన్న కాల్వొడ్డు వంతెన,బైపాస్‌పై భారీగా ఉన్న ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు.

News November 28, 2025

స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర రసాయనాలు

image

AP: దోమల నివారణకు ఉపయోగించే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర మేపర్‌ఫ్లూథ్రిన్ అనే పురుగుమందు ఉన్నట్లు తేలింది. ఇటీవల విజయవాడలోని ఓ షాపులో తనిఖీలు చేసి స్లీప్‌వెల్ అగరబత్తీల నమూనాలను అధికారులు సేకరించారు. వాటిని HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్‌కు పంపగా ప్రాణాంతక కెమికల్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనివల్ల శ్వాసకోశ, నాడీ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

News November 28, 2025

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి B.Tech/ BE, MSc, MCA ఉత్తీర్ణులై, 22- 45ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.64,820- రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.