News December 2, 2025

యాదాద్రి : తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నామినేషన్

image

కనిపించని దేవుడి కన్నా మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అని పెద్దలంటుంటారు. ఇక ప్రతి బిడ్డ విజయం వెనుక వారు ఉంటారు. అయితే ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల తరుణంలో యాదాద్రి జిల్లా రామన్నపేట(మం) ఇంద్రపాలనగరానికి చెందిన గర్దాస్ విక్రమ్.. BRS బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దానికి ముందు ఆయన వారి అమ్మనాన్నలకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అతడిని పలువురు అభినందిస్తున్నారు.

Similar News

News April 5, 2026

సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారా? జాగ్రత్త!

image

సెలబ్రిటీలు, మహిళలే లక్ష్యంగా SMలో బూతులు తిట్టేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల రేణూ దేశాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. SMలో ఫేమస్ అవ్వాలని, యూట్యూబ్‌లో వ్యూస్ కోసమే ఇలా చేసినట్లు పలువురు నిందితులు చెప్పడం గమనార్హం. ఇలాంటి చర్యల వల్ల కెరీర్, వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాక్ స్వాతంత్య్రం హద్దు మీరకూడదంటున్నారు.

News April 5, 2026

వనపర్తి: కరెంట్ షాక్‌తో రైతు మృతి

image

ఏదుల మండలం గుండ్యవాల్య నాయక్ తాండ గ్రామపంచాయతీకి చెందిన కాట్రావత్ లోకేష్ (45) వ్యవసాయ పొలం వద్ద ఈరోజు ఉదయం 6:30కు కరెంట్ షాక్‌తో మరణించారు. వ్యవసాయ పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి ప్రమాదానికి గురైనట్లు బీజేపీ నేత తిరుపతి నాయక్ తెలిపారు. ఏడాది క్రితం వరకు ఆయన పోస్ట్ మెన్‌గా పనిచేశారన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 5, 2026

VZM: ట్రాక్టర్, టీవీఎస్ ఢీకొని వ్యక్తి మృతి

image

రేగిడి ఆమదాలవలస మండలం కాగితాపల్లి వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాం వైపు వస్తున్న ట్రాక్టర్, ఎదురుగా వస్తున్న టీవీఎస్ బండి ఢీకొన్నాయి. టీవీఎస్‌పై ఉన్న గలావిల్లికి చెందిన చందక గోవిందరావు (37) కిందపడగా ట్రాక్టర్ అతని మీదుగా వెళ్లింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.