News March 30, 2025
యాదాద్రి దేవస్థానం పంచాంగాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం పంచాంగాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, పలువురు మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు నరసింహమూర్తిని ఘనంగా సన్మానించారు.
Similar News
News December 6, 2025
మర్రిగూడ: పట్టుబడుతున్నా మారట్లేదు

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందన్న చర్చ నడుస్తోంది. గతంలో పనిచేసిన తహశీల్దార్లు మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్, సర్వేయర్ రవి నాయక్ పలువురి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడడం మండలంలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకుని సక్రమంగా విధులు నిర్వహించి మర్రిగూడకు మంచి పేరు తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.
News December 6, 2025
ఖర్చు ఎంతైనా వెనకాడని అభ్యర్థులు..

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు స్థాయికి మించి ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. కొందరు భూమలను, బంగారం సైతం తాకట్టు పెడుతున్నారు. ASF జిల్లాలో చిన్న పంచాయతీల్లో సైతం ఒక్కో అభ్యర్థి రూ.15 నుంచి25 లక్షలు ఖర్చు చేసే పరిస్థితి నెలకొంది. పెద్ద జీపీల్లో రూ.20 నుంచి రూ.30 లక్షల దాకా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. కొందరు ప్రచారంలో పాల్గొనే వారికి రోజుకు రూ.500 చొప్పున కూలి కట్టి ఇస్తున్నారు.
News December 6, 2025
కెప్టెన్సీకి నేను సిద్ధం: రియాన్ పరాగ్

IPL-2026లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పరాగ్ తెలిపారు. ‘గత సీజన్లో 7-8 మ్యాచులకు కెప్టెన్సీ చేశా. 80-85% సరైన నిర్ణయాలే తీసుకున్నా. మినీ ఆక్షన్ తర్వాత కెప్టెన్ ఎవరనేది డిసైడవుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ CSKకి ట్రేడ్ అవడంతో తర్వాతి కెప్టెన్ ఎవరనే చర్చ జరుగుతోంది. జైస్వాల్, జురెల్, పరాగ్ ఈ రేసులో ఉన్నారు.


