News September 18, 2024

యాదాద్రి: నిమజ్జనానికి వెళ్లి యువకుడి మృతి

image

వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భూదాన్ పోచంపల్లి మండలంలో జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌యాదవ్ (27) వినాయక నిమజ్జనం కోసం చెరువుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతిచెందాడు. అప్పటివరకు తమతో ఆనందంగా గడిపిన స్నేహితుడు మృతిచెందడంతో అతడి మిత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Similar News

News December 21, 2025

నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

NLG: 23న కేటీఆర్ రాక.. ఏర్పాట్ల పరిశీలన
NLG: ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
మిర్యాలగూడలో నకిలీ వైద్యుల గుట్టురట్టు
నల్గొండలో ప్రమాదకరంగా మ్యాన్ హోల్
చిట్యాల: ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి?
నల్గొండ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
కట్టంగూరు హస్తంలో లుకలుకలు
నిడమనూరు: ఆ 5 గ్రామాల పల్లె పగ్గాలు యువత చేతికి
నల్గొండ: త్వరలో సహకార ఎన్నికలు

News December 20, 2025

సోమవారం యథావిధిగా ‘ప్రజావాణి’: నల్గొండ కలెక్టర్

image

ఎన్నికల కోడ్‌ ముగియడంతో జిల్లాలో నిలిచిపోయిన ‘ప్రజావాణి’ కార్యక్రమం తిరిగి ఈ సోమవారం నుంచి యథావిధిగా అర్జీలను స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం విదితమే. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి బాధితులు తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని ఆమె తెలిపారు.

News December 20, 2025

మీ డబ్బు.. మీ సొంతం: కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

image

నల్గొండ జిల్లాలోని బ్యాంకుల్లో సుమారు రూ.66 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఉదయాదిత్య భవన్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నామినీ వివరాలు లేకపోవడం, కేవైసీ అప్‌డేట్ చేయకపోవడం వల్ల ఈ నిధులు నిలిచిపోయాయని వివరించారు. ఖాతాదారులు వెంటనే తమ బ్యాంకు వివరాలు సరిచూసుకుని, నిబంధనల ప్రకారం సొంత నిధులను క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు.