News March 21, 2025
యాదాద్రి: ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు

జిల్లాలో 10వ తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకుని పరీక్ష హాల్లోకి వెళ్లారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనుంది.
Similar News
News November 17, 2025
సత్యసాయి భక్తుల కోసం ‘SAI100’ యాప్

పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ‘SAI100’ యాప్ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. యాప్లో రోజు వారీగా ఈవెంట్ కార్యకలాపాలు, వసతి, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, తాగునీటి పాయింట్లు, ఆహార పంపిణీ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర వివరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ యాప్ను భక్తులు, అధికారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News November 17, 2025
జగిత్యాల: 7 ఏళ్ల బాలికపై అత్యాచారం

సారంగాపూర్ మండలంలోని ఓ గ్రామంలో చిన్నారి(7)పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు SI గీత తెలిపారు. శనివారం రాత్రి బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా పక్కింటి బాపు అనే వ్యక్తి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే బాలిక రోదిస్తూ కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు PSలో ఫిర్యాదు చేశారు. దీంతో బాపుపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
News November 17, 2025
బాలానగర్లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


