News March 14, 2025

యాదాద్రి: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

యాదాద్రిలో ఓ చెట్టుకు విరబూసిన మోదుగ పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకుందాం. ఆరోగ్యంగా ఉందాం. HAPPY HOLI

Similar News

News February 12, 2026

ఏర్పేడు: ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తులు

image

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతిలో ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ -01 పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. మాస్టర్స్/ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్, అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iittp.ac.in/Outsourced_Positions వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 15.

News February 12, 2026

ఉప్పుతో పిల్లలకు ముప్పు.. తస్మాత్ జాగ్రత్త!

image

చిన్న పిల్లల ఆహారంలో అదనంగా ఉప్పు చేర్చడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఏడాదిలోపు పిల్లల కిడ్నీలు సున్నితంగా ఉండటం వల్ల ఉప్పును తట్టుకోలేవు. తల్లి పాలతో పాటు సహజ ఆహారంలో ఉండే సోడియం వారికి సరిపోతుంది. చిన్నప్పుడే ఉప్పు అలవాటు చేస్తే పెద్దయ్యాక BP, గుండె సమస్యలు రావొచ్చు. చిరుతిళ్లకు బదులు పండ్లు, కూరగాయలు అలవాటు చేస్తూ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి’ అని సూచిస్తున్నారు.

News February 12, 2026

నిర్మల్: బల్దియా పీఠం ఎవరికి ?

image

నిర్మల్ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కనుందో శుక్రవారం తేలనుంది. ఛైర్‌పర్సన్ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో ఆసక్తి నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పీఠం దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. ఎవరికి వారు తమ పార్టీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిర్మల్ బల్దియాపై ఏ పార్టీ ఆధిపత్యం చాటుతుందో వేచి చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.