News March 5, 2025

యాదాద్రి బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ సమావేశం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు వివిధ శాఖల మంత్రులు వస్తున్న సందర్భంగా అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆలయ ఈఓ భాస్కర్ రావు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Similar News

News October 22, 2025

రూ.10వేల కోట్లతో ‘S-400’ కొనుగోలు

image

‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్ మిస్సైళ్లు, డ్రోన్లను విజయవంతంగా నేలకూల్చిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను భారీగా కొనుగోలు చేయాలని భారత్ యోచిస్తోంది. రష్యా నుంచి రూ.10వేల కోట్ల విలువైన ఈ ఆయుధ వ్యవస్థల కోసం ఇప్పటికే భారత ఎయిర్‌ఫోర్స్ చర్చలు జరిపిందని ANI వెల్లడించింది. 5 S-400ల కోసం 2018లో భారత్ రష్యాతో డీల్ సైన్ చేసింది. మరోవైపు బ్రహ్మోస్ క్షిపణుల బలోపేతానికి భారత్-రష్యా కలిసి పని చేస్తున్నాయి.

News October 22, 2025

GNT: 40 ఏళ్ల పాటు ఓ పత్రికను నడిపారంటే మాటలా.!

image

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కోలవెన్ను రామకోటేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలో 1894 అక్టోబర్ 22న జన్మించారు. న్యాయశాస్త్ర పట్టభద్రులైన ఆయన జాతీయోద్యమం వైపు వెళ్లారు. 1928లో బందరు జాతీయ కళాశాలలో మొదట ఉపాధ్యాయుడిగా, తరువాత ప్రిన్సిపల్‌గా పనిచేశారు. బందరు నుంచి వెలువడిన త్రివేణి అనే సాంస్కృతిక పత్రికను సుమారు 4 దశాబ్దాలు నిర్వహించారు. 1940లో పలు ఉద్యమాలలో పాల్గొని జైలుకు సైతం వెళ్లారు.

News October 22, 2025

NZB: రియాజ్ మృతి.. డీజీపీకి SHRC ఆదేశాలు

image

రియాజ్ మృతిపై తెలంగాణ మానవ హక్కుల కమినషన్(SHRC) స్పందించింది. మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసింది. నవంబర్ 24వ తేదీలోగా ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని డీజీపీ శివధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. కాల్పులకు దారి తీసిన పరిస్థితులు, కేసు ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం రిపోర్టు అందజేయాలంది. కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపినట్లు డీజీపీ ప్రకటించారు.