News March 5, 2025

యాదాద్రి బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ సమావేశం

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు వివిధ శాఖల మంత్రులు వస్తున్న సందర్భంగా అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆలయ ఈఓ భాస్కర్ రావు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Similar News

News March 6, 2025

బీజేపీలో జోష్.. కాంగ్రెస్‌లో నైరాశ్యం!

image

KNR-ADB-NZB-MDK జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ MLC స్థానాలను కైవసం చేసుకుని BJP జోష్‌లో ఉంది. రాష్ట్ర నేతలు సమష్టి కృషితో అంజిరెడ్డి, కొమురయ్యలను గెలిపించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ పట్టభద్రుల స్థానాన్ని కోల్పోయి INC నైరాశ్యంలో పడిపోయిందని సమాచారం. అక్కడ ఏడుగురు మంత్రులు, 23 మంది MLAలు ఉన్నా అంతర్గత కలహాలు కొంపముంచాయని తెలుస్తోంది.

News March 6, 2025

తెనాలి: వేరువేరు ఘటనల్లో ఇద్దరు మృతి 

image

తెనాలి రైల్వేస్టేషన్లో బుధవారం సుమారు 60 ఏళ్ల మహిళ ప్లాట్‌ఫారం చివర పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొట్టడంతో మరణించింది. ఆమె వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు భావిస్తున్నారు. మరో ఘటనలో తిరుమల ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సుమారు 50ఏళ్ల వ్యక్తి తెనాలి శివారు యడ్ల లింగయ్య కాలనీ రైల్వే గేటు సమీపంలో రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. జీఆర్పీ పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

News March 6, 2025

HYD: మార్చి 8న వాటర్ బంద్

image

BHEL జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తున్న కారణంగా ఈనెల 8న నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని HMWSSB అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎర్రగడ్డ, SRనగర్, HBకాలనీ, మూసాపేట, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, అశోక్‌నగర్, RCపురం, లింగంపల్లి, చందానగ, మదీనాగూడ, మియాపూర్, గంగారం, జ్యోతినగర్, బీరంగూడ, శ్రీనగర్, అమీన్‌పూర్, నిజాంపేట్‌‌లో అంతరాయం ఉంటుందన్నారు.

error: Content is protected !!