News February 15, 2025
యాదాద్రి భువనగరి: మరోసారి కులగణన..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి కులగణన నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్వహించిన కులగణనలో 3 లక్షల పైచిలుకు మంది పాల్గొన లేదని తెలిసింది. అయితే వారందరి కోసం మళ్లీ కులగణన నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు కులగణన నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఆన్లైన్ సర్వేతో పాటు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఎంపీడీవో ఆఫీస్లో ప్రజాపాలన అధికారుల వద్ద కూడా నమోదు చేసుకోవచ్చు.
Similar News
News November 18, 2025
జగిత్యాల: KGBVలో దరఖాస్తుల ఆహ్వానం

రాయికల్ మండలం ఉప్పుమడుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్వీపర్ కం స్కావెంజర్గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి రాఘవులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రానికి చెందిన మహిళా అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై, 18-45 వయసు గలవారు అర్హులన్నారు. ఈనెల 19లోపు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణిని సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. SHARE IT.
News November 18, 2025
జగిత్యాల: KGBVలో దరఖాస్తుల ఆహ్వానం

రాయికల్ మండలం ఉప్పుమడుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్వీపర్ కం స్కావెంజర్గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి రాఘవులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రానికి చెందిన మహిళా అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై, 18-45 వయసు గలవారు అర్హులన్నారు. ఈనెల 19లోపు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణిని సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. SHARE IT.
News November 18, 2025
HYD: మిద్దె తోటలతో ఎన్నో ప్రయోజనాలు

HYDలో మిద్దె తోటల పెంపకం జోరందుకుంది. ఈ పద్ధతితో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు పండించుకుని నేచురల్ ఫుడ్ తీసుకోవచ్చు. మరోవైపు భవన ఉష్ణోగ్రతలు తగ్గతుందని పేర్కొన్నారు. నీటి ఉపయోగం పెద్దగా లేకుండా ఈజీగా ఫ్రెష్గా వండుకోవచ్చని డా.విష్ణు వందన తెలిపారు. ఉద్యానశాఖ నెలలో రెండో శనివారంలో ఒక్కోచోట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.


