News January 25, 2025

యాదాద్రి భువనగిరి: గ్రామ సభలకు 74,614 దరఖాస్తులు

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు రోజులగా నిర్వహిస్తున్న గ్రామసభలు నేటితో ముగిసాయి. జిల్లాలో గ్రామసభల ద్వారా 74,614 దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. రైతు భరోసా 2698 దరఖాస్తులు, రేషన్ కార్డులు కొరకు 28,049 దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల కొరకు 32,316 దరఖాస్తులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 11,551 దరఖాస్తులు వచ్చాయి.

Similar News

News October 24, 2025

నిర్మల్: ‘ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులుంటే కాల్ చేయండి’

image

​జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సన్న, దొడ్డు రకాలకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తూకపు యంత్రాలకు స్టాంపింగ్‌ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా టార్పాలిన్‌లు, సంచులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. రైతులకు ఏవైనా సమస్యలుంటే 91829 58858కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.

News October 24, 2025

పల్నాడు: అవిశ్వాసానికి వేళాయె..!

image

మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల పదవి కాలం 4 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పలుచోట్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తూ ఉండటంతో రాజకీయ అలజడి ప్రారంభమైంది. కారంపూడిలో ఇప్పటికే అవిశ్వాసం ఆమోదం పొందడంతో ఎంపీపీ మేకల శారద పదవి కోల్పోయారు. ముప్పాళ్ల ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి సభ్యులు నోటీసులు ఇచ్చారు. మరి కొన్ని చోట్ల ఇవే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

News October 24, 2025

కర్నూలు ప్రమాద ఘటనపై Dy.CM భట్టి దిగ్ర్భాంతి

image

కర్నూల్ జిల్లా బస్సు ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్ రోడ్డు ప్రమాదంలో మంటలు అంటుకొని పలువురు సజీవ దహనమైన విషయాన్ని తెలుసుకున్న భట్టి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.