News March 5, 2025
యాదాద్రి భువనగిరి జిల్లాలో 29 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటి పరిసరాల్లో BNS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈసారి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ను అమలులోకి తీసుకొచ్చారు. జిల్లాలో 12,558 మంది పరీక్ష రాయనున్నారు.
Similar News
News November 20, 2025
జర్నలిస్టులకు క్రికెట్ పోటీలు: ములుగు ఎస్పీ

జిల్లాలోని జర్నలిస్టులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శబరిష్ తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఒక్క టీం చొప్పున వివరాలను అందజేయాలని ఎస్పీ సూచించారు. జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో పోటీలు నిర్వహించబడతాయని అన్నారు. వివరాలకు స్థానిక ఎస్హెచ్ఓలను సంప్రదించాలని ఎస్పీ పేర్కొన్నారు.
News November 20, 2025
బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి గడువు విధించలేం: సుప్రీంకోర్టు

బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకి తాము గడువు నిర్దేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గడువు విధించడం రాజ్యాంగ అధికారాలను తుంగలో తొక్కడమేనని పేర్కొంది. అయితే సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. అయితే గవర్నర్లు మాత్రం బిల్లులను ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం లేదా తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలంది. వారికి నాలుగో అధికారం లేదని స్పష్టం చేసింది.
News November 20, 2025
ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు అమ్మాయిలకే ఎక్కువ

మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడూ వైరస్లూ, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక కణాలు ఒంట్లోని సొంత కణాలతోనే పోరాడతాయి. వాటినే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. ఇవి మహిళల్లో 20-40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి.


