News March 5, 2025

యాదాద్రి భువనగిరి జిల్లాలో 29 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటి పరిసరాల్లో BNS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈసారి 5 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. జిల్లాలో 12,558 మంది పరీక్ష రాయనున్నారు.

Similar News

News November 18, 2025

పాఠశాల్లో కూడా ముస్తాబును నిర్వహించాలి: కలెక్టర్

image

విద్యార్థుల ముస్తాబు కార్యక్రమం మాదిరిగా ఇకపై పాఠశాలల ముస్తాబు కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం పార్వతీపురం GJ కళాశాల సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రధానోపాధ్యాయులతో జిల్లా స్థాయి సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ప్రతి పాఠశాలలో దీన్ని ఖచ్చితంగా ఆచరించాలని, పాఠశాల ప్రాంగణంలో చెత్త లేకుండా పరిశుభ్ర వాతావరణం కనిపించాలన్నారు.

News November 18, 2025

గిల్ స్థానంలో గైక్వాడే కరెక్ట్: ఆకాశ్ చోప్రా

image

గిల్ SAతో రెండో టెస్టు ఆడతారా, లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఆడకపోతే అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ని తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. ‘గిల్ స్థానంలో ఆడేందుకు సాయి సుదర్శన్, పడిక్కల్ ఉన్నారు. కానీ వారిలో ఎవరిని తీసుకున్నా జట్టులో ఏడుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లవుతారు. అది మంచిది కాదు. రుతురాజ్ డొమెస్టిక్‌గా బాగా రాణిస్తున్నారు. అతనే కరెక్ట్ అనిపిస్తోంది’ అని తెలిపారు.

News November 18, 2025

ఆదిలాబాద్‌లో రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు

image

బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తలపెట్టిన బంద్‌ను విరమించుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ, ప్రైవేటు ద్వారా పత్తి కొనుగోళ్లు యథావిధిగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని సూచించారు.