News March 24, 2025
యాదాద్రి: రూ.20 లక్షల స్కాలర్ షిప్

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి ఇన్ఛార్జి అధికారి వసంత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్ అందుతుందన్నారు.
Similar News
News November 7, 2025
BREAKING: వికారాబాద్ జిల్లాలో దారుణం

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ సీఐ వెంకట్ తెలిపారు. శుక్రవారం మర్పల్లి మండలం కోట్ మర్పల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వహేద్, అదే గ్రామానికి చెందిన బాలికను హాస్టల్లో దింపేందుకు తీసుకెళ్లాడన్నారు. మోమిన్పేట్ మండలం దేవరంపల్లి అడవిలో మరో వ్యక్తి నర్సింహులు సహకారంతో అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. వారిని అరెస్ట్ చేశారు.
News November 7, 2025
ఫోన్ అడిక్షన్: 25 ఏళ్ల తర్వాత ఇలా ఉంటారట!

ఇటీవల ఫోన్ అడిక్షన్ పెరిగిపోతోంది. రోజంతా రీల్స్ చూస్తూ యువత గడుపుతోంది. ఎటూ కదలకుండా, కేవలం ఫోన్లో మునిగిపోయే వారు 2050 నాటికి ఎలా ఉంటారో ఊహిస్తూ స్టెప్ ట్రాకింగ్ యాప్ WeWard ఓ ఫొటో షేర్ చేసింది. వెన్నెముక వంగిపోయి, జుట్టు రాలిపోయి, వృద్ధాప్యం ముందే రావడం, ముఖంపై డార్క్ సర్కిల్స్, ఊబకాయం వంటివి వస్తాయని హెచ్చరించింది. పలు ఆరోగ్య సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ‘Sam’ అనే మోడల్ను రూపొందించింది.
News November 7, 2025
పెద్దపల్లి: ‘ఇందిరమ్మ ఇండ్లను 100% గ్రౌండ్ చేయాలి’

PDPL జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను 100% గ్రౌండ్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. PDPL నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, 800కి పైగా ఇండ్లు ఇంకా మార్కింగ్ కాలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆసక్తిలేని లబ్ధిదారుల ఇండ్లు రద్దుచేయాలని, అవసరమైతే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలన్నారు. నిర్మాణపనులు వేగవంతం చేసి, వివరాలను ఆన్లైన్లో నమోదుచేయాలని తెలిపారు


