News February 20, 2025
యాదాద్రి శ్రీవారికి భారీగా ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. బుధవారం 1,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.55,000, ప్రసాద విక్రయాలు రూ.8,00,970, VIP దర్శనాలు రూ.1,50,000, బ్రేక్ దర్శనాలు రూ.1,09,200, కార్ పార్కింగ్ రూ.2,28,000, యాదరుషి నిలయం రూ.54,972, లీజెస్ రూ.5,50,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.24,44,864 ఆదాయం వచ్చింది.
Similar News
News February 24, 2026
YCP హయాంలో హిందూమతంపై దాడి: CBN

AP: వైసీపీ ప్రభుత్వంలో తిరుమలపైనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హిందూమతంపై దాడులు చేశారని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆరోపించారు. ‘2,032 దేవాలయాలపై దాడి చేశారు. 59 విగ్రహాలు చోరీ అయ్యాయి. ఎన్నో చోట్ల విగ్రహాలను అపవిత్రం చేశారు. అంతర్వేది రథం దగ్ధాన్ని తేనెటీగల దాడి అని చెప్పారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేశారు’ అని వివరించారు. ఎవరైనా దేవాలయాల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
News February 24, 2026
నిర్మల్: పది పరీక్షలకు 9,758 మంది విద్యార్థులు

పదవ తరగతి పరీక్షలను మార్చి 14 నుంచి, ఏప్రిల్ 16వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి, 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు. జిల్లావ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 9,758 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
News February 24, 2026
నిర్మల్: ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయండి: ఎస్పీ

విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఎస్పీ జానకి షర్మిల విద్యార్థులకు సూచించారు. పరీక్షలు ప్రారంభం నుంచి ముగింపు వరకు నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించబడుతుందని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా, ప్రశ్నపత్రాలు రవాణా పరీక్ష అనంతరం సమాధాన పత్రాల భద్రత కోసం ప్రత్యేక ఎస్కార్ట్ను ఏర్పాటు చేశామన్నారు.


