News March 17, 2025
యాదాద్రి శ్రీవారికి భారీగా నిత్య ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఆదివారం 2,600 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.1,30,000లు, ప్రసాద విక్రయాలు రూ.18,42,320, VIP దర్శనాలు రూ.7,65,000, బ్రేక్ దర్శనాలు రూ.4,05,600, కార్ పార్కింగ్ రూ.6,37,000, యాదరుషి నిలయం రూ.2,34,911, లీజెస్ రూ.19,20,572, అర్చనలు రూ.1,09,316 తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.68,33,880 ఆదాయం వచ్చింది.
Similar News
News October 22, 2025
Congratulations మేఘన

పెద్దకడబూరు జడ్పీ పాఠశాలలో చదివే 9వ తరగతి విద్యార్థిని మేఘన ‘క్వాంటం ఏజ్ బిగిన్స్-పొటెన్షియల్ అండ్ చాలెంజెస్’ అనే అంశంపై జరిగిన రాష్ట్రస్థాయి సెమినార్లో ప్రతిభ చాటారు. ఈ మేరకు ప్రశంసా పత్రం, మెడల్ మంగళవారం హెచ్ఎం ఉమా రాజేశ్వరమ్మ చేతుల మీదుగా మేఘనకు అందజేశారు. మనమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నామని, కాబట్టి విద్యార్థులు క్వాంటం మెకానిక్స్ అనే అంశంపై ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు.
News October 22, 2025
నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. ఇవాళ 10amకు హైదరాబాద్ నుంచి దుబాయ్ బయలుదేరుతారు. వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కు వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మూడు రోజుల్లో రోడ్ షోతో పాటు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ కానున్నారు.
News October 22, 2025
కార్తీకం: ప్రమిదల్లో ఎన్ని వత్తులు ఉండాలి?

కార్తీక మాసంలో ప్రమిదలో రెండు వత్తులను వెలిగిస్తే శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 3 వత్తులు ధనవృద్ధినీ, నాలుగు ఐశ్వర్యాన్నీ, ఐదు అఖండ సంపదల్నీ, ఏడు మోక్షాన్నీ ప్రసాదిస్తాయంటున్నారు. మనలో ఉండే పంచతత్వాలకు నిదర్శనంగా 5 రుచులతో ఉండే ఉసిరికపైనా దీపాన్ని వెలిగించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఒక వత్తిని వెలిగించినా పుణ్యం లభిస్తుందని వివరిస్తున్నారు.