News March 24, 2025

యాదాద్రి శ్రీవారికి భారీగా నిత్య ఆదాయం

image

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి నిత్య ఆదాయ వివరాలను ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఆదివారం 2,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా వీటి ద్వారా రూ.1,03,200, ప్రసాద విక్రయాలు రూ.19,04,650, VIP దర్శనాలు రూ.8,10,000, బ్రేక్ దర్శనాలు రూ.3,78,900, కార్ పార్కింగ్ రూ.7,04,500, యాదరుషి నిలయం రూ.1,92,054, ప్రధాన బుకింగ్ రూ.2,55,650, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.49,28,666 ఆదాయం వచ్చిందన్నారు.

Similar News

News November 17, 2025

మదనాపూర్: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న జపాన్ దేశస్థులు

image

దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని సోమవారం ఉదయం జపాన్ దేశస్థులు దర్శించుకున్నారు. వారు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.

News November 17, 2025

నెల్లూరు జిల్లాలో 10th విద్యార్థులకు అపార్ గండం

image

విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం 10th విద్యార్థులకు గండంగా మారింది. NEP ప్రకారం విద్యార్థులందరికీ అపార్ గుర్తింపు కార్డు, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ (PEN) ఉండాలి. స్కూల్ రికార్డ్‌లోని వివరాలు, విద్యార్థి ఆధార్ వివరాలు అక్షరం తప్పు లేకుండా సరిపోయిన విద్యార్థులకు APAAR. ID, PEN లభిస్తాయి. అవి ఉంటేనే 10th పరీక్ష ఫీజు చెల్లింపు అవుతుంది. వేల మంది విద్యార్థులకు ఈ ప్రక్రియ ఇంకా పెండింగ్‌లో ఉంది.

News November 17, 2025

అంగన్వాడీ కేంద్రాల ద్వారా బలమైన బాల్యం: సీతక్క

image

బాల్యంలోనే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తు బలంగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్ఠికాహారం అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు పుష్ఠికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్నామన్నారు. కుళ్లిపోయిన కోడిగుడ్లు, నాసిరకం పాలను సరఫరాచేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చంటి పిల్లలు దేవుళ్లతో సమాని, వారిని సంరక్షిస్తామన్నారు.