News March 24, 2025
యాదాద్రి శ్రీవారికి భారీగా నిత్య ఆదాయం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి నిత్య ఆదాయ వివరాలను ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఆదివారం 2,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా వీటి ద్వారా రూ.1,03,200, ప్రసాద విక్రయాలు రూ.19,04,650, VIP దర్శనాలు రూ.8,10,000, బ్రేక్ దర్శనాలు రూ.3,78,900, కార్ పార్కింగ్ రూ.7,04,500, యాదరుషి నిలయం రూ.1,92,054, ప్రధాన బుకింగ్ రూ.2,55,650, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.49,28,666 ఆదాయం వచ్చిందన్నారు.
Similar News
News October 22, 2025
సిరిసిల్ల అదనపు కలెక్టర్గా గరిమా అగర్వాల్

రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్గా గరిమా అగర్వాల్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈమె ప్రస్తుతం సిద్దిపేట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులో ఆమెను నియమించారు.
News October 22, 2025
జగిత్యాల: జర్మనీలో చదువు.. ఉద్యోగ అవకాశాలు

టామ్ కం ఆధ్వర్యంలో జర్మనీలో నర్సింగ్ లో 3 సంవత్సరాల ఇంటర్నేషనల్ డిగ్రీ పొందడానికి తర్వాత నర్సుగా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తుందని జిల్లా ఉపాధి కల్పనా అధికారి సత్యమ్మ తెలిపారు. ఇంటర్ 60% మార్కులతో ఉత్తీర్ణులై 18-28 వయసుగల వారు అర్హులన్నారు. శిక్షణ సమయంలో లక్ష స్టైఫండ్, అనంతరం 2 నుండి 3 లక్షల ఆకర్షణీయ జీతంతో ఉద్యోగ హామీ లభిస్తుందన్నారు. వివరాలకు 6302292450 నెంబర్లో సంప్రదించాలన్నారు.
News October 22, 2025
‘చింతలపూడిలో మౌలిక వసతులను కల్పించండి’

చింతలపూడి MLA సొంగా రోషన్ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. చింతలపూడి, లింగపాలెం మండలాలను ఏలూరు రెవెన్యూ డివిజన్లో కలపాలని అన్నారు. రహదారుల అభివృద్ధి, ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని కోరారు. తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు గుత్తా వేంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.