News March 24, 2025

యాదాద్రి శ్రీవారికి భారీగా నిత్య ఆదాయం

image

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి నిత్య ఆదాయ వివరాలను ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఆదివారం 2,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా వీటి ద్వారా రూ.1,03,200, ప్రసాద విక్రయాలు రూ.19,04,650, VIP దర్శనాలు రూ.8,10,000, బ్రేక్ దర్శనాలు రూ.3,78,900, కార్ పార్కింగ్ రూ.7,04,500, యాదరుషి నిలయం రూ.1,92,054, ప్రధాన బుకింగ్ రూ.2,55,650, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.49,28,666 ఆదాయం వచ్చిందన్నారు.

Similar News

News November 11, 2025

భద్రాది: జిల్లా స్థాయి క్విజ్‌లో మామిళ్లవారిగూడెం విద్యార్థి

image

టీఎస్ జీహెచ్ఎంఏ, టీఎస్ఏటీ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో అశ్వారావుపేట మండల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మామిళ్లవారిగూడెం జడ్పీహెచ్ఎస్ విద్యార్థి మద్దాల ప్రవీణ్‌కుమార్ కన్సోలేషన్ బహుమతి పొందాడు. మండల స్థాయిలో నారాయణపురం, గుమ్మడవల్లి, అశ్వారావుపేట జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు క్విజ్‌, వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో రాణించారు. ఎంఈఓ ప్రసాదరావు, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ అభినందించారు.

News November 11, 2025

NLG: ప్రమాదాల నివారణకు సమన్వయం అవసరం: కలెక్టర్‌

image

రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బ్లాక్‌స్పాట్‌లలో శాశ్వత చర్యలు చేపట్టాలి. స్కూల్‌ బస్సులకు సైడ్‌ మిర్రర్లు, సహాయకులు తప్పనిసరిగా ఉండాలన్నారు.

News November 11, 2025

విశాఖలో విషాద ఘటన

image

మద్యానికి బానిసైన కొడుకును కన్న తండ్రి హతమార్చిన ఘటన విశాలాక్షి నగర్లో చోటు చేసుకుంది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6వ తేదీన మద్యానికి డబ్బులు కావాలని వై.ప్రసాద్ (36) తండ్రి లక్ష్మణరావును వేధించాడు. కోపోద్రిక్తుడైన తండ్రి కొడుకు తలపై కర్రతో బలంగా కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టాడు. మృతుని భార్య రాజీ ఫిర్యాదుతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.