News March 24, 2025
యాదాద్రి శ్రీవారికి భారీగా నిత్య ఆదాయం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి నిత్య ఆదాయ వివరాలను ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఆదివారం 2,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా వీటి ద్వారా రూ.1,03,200, ప్రసాద విక్రయాలు రూ.19,04,650, VIP దర్శనాలు రూ.8,10,000, బ్రేక్ దర్శనాలు రూ.3,78,900, కార్ పార్కింగ్ రూ.7,04,500, యాదరుషి నిలయం రూ.1,92,054, ప్రధాన బుకింగ్ రూ.2,55,650, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.49,28,666 ఆదాయం వచ్చిందన్నారు.
Similar News
News October 3, 2025
MDK: ఎన్నికలు.. ఖర్చు పెట్టే వారికే టికెట్లు?

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు జరిగే ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 9న విడుదల చేయనున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధానంగా ఖర్చు పెట్టుకుంటామని ముందుకు వచ్చే వారికే టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. దీనిపై మీ కామెంట్.
News October 3, 2025
కరీంనగర్: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

కరీంనగర్ నగరంలోని విద్యానగర్లో దాసరి కృష్ణ కుమార్ గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చేర్ల బూత్కూర్ గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ కొంతకాలంగా KNRలో ఉంటున్నాడని, ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడినట్లు చెప్పారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీ గదికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News October 3, 2025
శక్తిమంతమైన కంటెంట్ పోస్ట్ చేయండి: సజ్జనార్

సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. కంటెంట్ హాస్యం కోసం కాకుండా శక్తిమంతంగా ఉండాలని Xలో పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను మహిళా రక్షణ, డ్రగ్స్ వ్యతిరేక, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించే రీల్స్, పోస్టులకు వేదికగా మార్చాలని పేర్కొన్నారు. లైక్స్ కాదు, జీవితాలను(లైవ్స్) కాపాడటమే ముఖ్యమన్నారు. మీరు ఇవాళ చేసే వీడియో రేపు ఒక జీవితాన్ని నిలబెడుతుందని సూచించారు.