News February 24, 2025
యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం ఎంతంటే..?

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు ఆదివారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ఈరోజు భక్తులు 2,116 మంది తలనీలాలు సమర్పించగా రూ.1,05,800, ప్రసాదాలు రూ.11,09,160, VIP దర్శనం రూ.5,55,000, బ్రేక్ దర్శనాలు రూ.98,700, ప్రధానబుకింగ్ రూ.2,34,600, కార్ పార్కింగ్ రూ.2,47,500, వ్రతాలు రూ.1,56,800, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.29,24,128 ఆదాయం వచ్చినట్లు EO భాస్కర్ రావు తెలిపారు.
Similar News
News November 20, 2025
ఫోన్పే టాప్!

మన దేశంలో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్పే ఆధిపత్యం కొనసాగుతోంది. 45.47% మార్కెట్ షేర్తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గూగుల్ పే (34.62%), పేటీఎం (7.36%), Navi (2.78%), సూపర్ మనీ (1.28%) ఉన్నాయి. ఫోన్పే, గూగుల్ పే కలిపి 80 శాతానికి పైగా మార్కెట్ షేర్ను కలిగి ఉండటం విశేషం. BHIM, CRED లాంటి ప్లాట్ఫామ్స్ కూడా వినియోగిస్తున్నారు. మరి మీరు ఏది వాడుతున్నారో కామెంట్ చేయండి.
News November 20, 2025
ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన ఆటో డ్రైవర్

ఎండాడకు చెందిన బొబ్బిలి రమేశ్ ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలు, భార్యను పోషిస్తున్నాడు. ఈనెల 10న తన నివాసంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. తలలో తీవ్ర రక్తస్రావం అయ్యి ఆరోగ్యం క్షీణించడంతో బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించగా అంగీకరించడంతో అవయవాలను ఐదుగురికి అమర్చనున్నారు. కుటుంబసభ్యుల మంచి మనసును పలువురు మెచ్చుకున్నారు.
News November 20, 2025
పల్నాడు వీర్ల గుడిని నిర్మించింది ముస్లింలని మీకు తెలుసా.?

పల్నాడు వీర్ల గుడిని ఔరంగజేబు సైన్యాధిపతులుగా పనిచేసిన జాఫర్, ఫరీదులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. నాగులేరు ఒడ్డున గుండ్రాయిలను పొయ్యి కింద వాడుకోగా, ఆగ్రహించిన చెన్నకేశవ స్వామి అవి వీరుల రూపాలని చెప్పాడు. ప్రాయశ్చిత్తంగా వీరుల గుడిని నిర్మించిన ఆ ఇద్దరు సైన్యాధిపతులు, తాము కూడా పూజలు అందుకోవాలనే కోరికతో వీర్ల గుడిలోనే సమాధి అయ్యారు. వారి సమాధులు నేటికీ గుడిలో ఉండటం ఇక్కడి విశేషం.


