News March 11, 2025

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. సోమవారం 1,356 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.67,800, ప్రసాదాలు రూ.9,64,760, VIP దర్శనాలు రూ.7,80,000, బ్రేక్ దర్శనాలు రూ.2,25,000, వ్రతాలు రూ.1,20,600, కార్ పార్కింగ్ రూ.1,79,500, యాదరుషి నిలయం రూ.52,858, సువర్ణ పుష్పార్చన రూ.56,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.28,46,968, ఆదాయం వచ్చింది.

Similar News

News October 19, 2025

పెనుగొండ: గోదావరిలో మహిళ మృతదేహం

image

పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గోదావరి నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. పెనుగొండ ఎస్ఐ కె. గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళ మృతదేహాన్ని నదిలో గుర్తించారు. సిద్ధాంతం వీఆర్‌వో నాగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 19, 2025

నిర్మల్: టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

image

చెడుపై మంచి విజయం సాధించిన ప్రతీకగా దీపావళిని జరుపుకుంటామని, ప్రతి ఇంటిలో ఆనందం, వెలుగు నిండాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజలకు, అధికారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధి కలగాలని కోరుకుంటూ, టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు.

News October 19, 2025

అనపర్తి: వివాహ వార్షికోత్సవం రోజే మహిళ ఆత్మహత్య..?

image

అనపర్తికి చెందిన శిరీష (30) వివాహ వార్షికోత్సవం రోజునే ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. భర్త సంతోశ్ ఆఫీసుకు వెళ్తూ జండూబామ్‌ కనపడకపోవడంతో భార్యను మందలించాడని, మనస్తాపం చెందిన శిరీష బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఉరి వేసుకుందని వారు పేర్కొన్నారు. అయితే భర్త, అత్త, ఆడపడుచు వేధింపుల వల్లే శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి అమ్మాజీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.