News March 14, 2025

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. గురువారం 620మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.31,000, ప్రసాద విక్రయాలు రూ.6,13,290, VIP దర్శనాలు రూ.1,50,000, బ్రేక్ దర్శనాలు రూ.1,05,900, కార్ పార్కింగ్ రూ.1,70,500, ప్రధాన బుకింగ్ రూ.80,450, సువర్ణ పుష్పార్చన రూ.46,800, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.30,58,258 ఆదాయం వచ్చింది.

Similar News

News October 24, 2025

ఖమ్మం: దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

image

భార్యపై అనుమానంతో భర్త గొడ్డలితో నరికి చంపిన దారుణ ఘటన ఏన్కూరు మండలం నాచారంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న తాటి గోవర్ధన(32)ను భర్త రామారావు అనుమానించేవాడు. ఈ విషయమై తెల్లవారుజామున ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో విసుగు చెందిన రామారావు గొడ్డలితో భార్యను చంపి, అనంతరం స్థానిక ఠాణాలో లొంగిపోయాడని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 24, 2025

19 మృతదేహాలు వెలికితీత

image

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బస్సులో ఇద్దరు పిల్లలు సహా మొత్తం 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ప్రయాణించినట్లు తెలిపారు. 21 మంది సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News October 24, 2025

వరంగల్: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురి చేస్తున్నాయి. మార్కెట్లో బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,010 పలకగా.. గురువారం రూ.6,810కి పడిపోయింది. ఈరోజు మళ్లీ పెరిగి, రూ.6,905కి చేరింది. రైతులు నాణ్యమైన, తేమలేని పత్తి తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.