News March 14, 2025
యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. గురువారం 620మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.31,000, ప్రసాద విక్రయాలు రూ.6,13,290, VIP దర్శనాలు రూ.1,50,000, బ్రేక్ దర్శనాలు రూ.1,05,900, కార్ పార్కింగ్ రూ.1,70,500, ప్రధాన బుకింగ్ రూ.80,450, సువర్ణ పుష్పార్చన రూ.46,800, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.30,58,258 ఆదాయం వచ్చింది.
Similar News
News November 27, 2025
కరెంట్ షాక్తో కడప జిల్లా యువకుడి మృతి

పులివెందులలోని వాసవీ కాలనీలో బుధవారం రాత్రి యువకుడు చైతన్య విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. యువకుడు ఇంటిలో పిండి గ్రైండింగ్ ఆడిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
News November 27, 2025
MTU 1232.. ముంపు ప్రాంత రైతులకు వరం

MTU 1075, స్వర్ణ రకాలతో సంకరణం చేసి MTU 1232ను అభివృద్ధి చేశారు. ఇది మధ్యస్థ సన్నగింజ రకం. నాట్లు వేశాక 14-15 రోజుల వరకు ముంపును తట్టుకోగలదు. పంటకాలం సాధారణంగా 135-140 రోజులు, ముంపునకు గురైతే 140-145 రోజులు. మొక్క ఎత్తు 120 సెం.మీ. అగ్గి తెగులు, దోమపోటు, మాగుడు తెగులును తట్టుకుంటుంది. ఇది సాధారణ భూమిలో ఎకరాకు 40 బస్తాలు, ముంపు ప్రాంతాల్లో ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడినిస్తుంది.
News November 27, 2025
అచ్చుతాపురం: అప్పుల భారం తాళలేక రైతు ఆత్మహత్య

అచ్చుతాపురం మండలం ఖాజీపాలెం గ్రామంలో అప్పుల భారంతో బద్ది నాగేశ్వరరావు(34) అనే రైతు మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే అచ్యుతాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు సీఐ చంద్రశేఖర రావు తెలిపారు.


