News March 15, 2025
యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శుక్రవారం 1,080 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.54,000, ప్రసాద విక్రయాలు రూ.11,78,890, VIP దర్శనాలు రూ.4,50,000, బ్రేక్ దర్శనాలు రూ.3,06,900, కార్ పార్కింగ్ రూ.4,20,870, యాదరుషి నిలయం రూ.64,160, సువర్ణ పుష్పార్చన రూ.92,316, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.29,93,218 ఆదాయం వచ్చింది.
Similar News
News November 13, 2025
ఢిల్లీ ఘటన ‘గ్యాస్ సిలిండర్ పేలుడు’: పాక్ మంత్రి

ఢిల్లీ <<18270750>>పేలుడు<<>>పై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ కుటిల వ్యాఖ్యలు చేశారు. ‘నిన్నటి వరకు అది గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇప్పుడు విదేశీ కుట్ర దాగి ఉందని భారత్ చెబుతోంది’ అని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఘటనను భారత్ వాడుకుంటుందని ఓ టీవీ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తమపై ఆరోపణలు చేసినా ఆశ్చర్యపోనని అన్నారు. తమ వరకు వస్తే ఊరికే ఉండబోమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.
News November 13, 2025
ASF: ఈ-పాస్ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోండి

జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9వ, 10వ తరగతి చదువుతున్న బీసీ (BC), ఈబీసీ (EBC) విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమాదేవి తెలిపారు. విద్యార్థులు https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News November 13, 2025
ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్టులను వేగవంతంగా చేయాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ బుధవారం అధికారులను ఆదేశించారు. రహదారులు, స్వదేశీ దర్శన్, నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్, ఆక్వాపార్క్ పనులపై కలెక్టరేట్ న్యూ వీసీ హాల్లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సూర్యలంక బీచ్, ఆక్వాపార్క్ అభివృద్ధిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.


