News March 19, 2025
యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన బుకింగ్ రూ.2,07,244, VIP దర్శనాలు రూ.1,65,000, బ్రేక్ దర్శనాలు రూ.1,57,200, ప్రసాద విక్రయాలు రూ.8,77,450, కళ్యాణకట్ట రూ.40,000, అన్నదాన విరాళాలు రూ.43,609 సువర్ణ పుష్పార్చన రూ.52,916 కార్ పార్కింగ్ రూ.2,06,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.21,14,642 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.
Similar News
News November 7, 2025
రాజన్న ఆలయం పడమరవైపు గేటు మూసివేత

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం పడమరవైపు గేటును మూసివేశారు. ఆలయ అభివృద్ధి నేపథ్యంలో రాజన్న ఆలయంలో సాధారణ దర్శనాలు కొనసాగిస్తున్న అధికారులు అన్నిరకాల ఆర్జిత సేవలను భీమేశ్వరాలయానికి మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పడమరవైపు స్వాగత ద్వారానికి అడ్డంగా రేకులను అమర్చారు. పీఆర్ఓ కార్యాలయ మార్గం నుంచి ఆలయంలోపలికి వెళ్లకుండా అక్కడ కూడా రేకులను అడ్డుగాపెట్టి రాకపోకలను నిలిపివేశారు.
News November 7, 2025
PRG: సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బట్టి పేలి.. ఒకరి మృతి

పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామం వద్ద ఉన్న సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు స్టీల్ కరిగించే బట్టి పేలింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నారీ జిల్లాకు చెందిన కార్మికుడు మహ్మద్ అలీ (33) గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో కార్మికుడు రషీద్తో పాటు పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు SI మోహనకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 7, 2025
నేడు పేర్కంకంపల్లికి ఎమ్మెల్సీ కవిత

యాలాల: చేవెళ్ల బస్సు ప్రమాదంలో పెర్కంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయిప్రియా, తనుష, నందిని మరణించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు MLC కవిత బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రానున్నారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.


