News March 19, 2025
యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయ వివరాలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన బుకింగ్ రూ.2,07,244, VIP దర్శనాలు రూ.1,65,000, బ్రేక్ దర్శనాలు రూ.1,57,200, ప్రసాద విక్రయాలు రూ.8,77,450, కళ్యాణకట్ట రూ.40,000, అన్నదాన విరాళాలు రూ.43,609 సువర్ణ పుష్పార్చన రూ.52,916 కార్ పార్కింగ్ రూ.2,06,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.21,14,642 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.
Similar News
News April 23, 2025
ఉగ్రవాదంపై కలిసి పోరాడాలి: హరీశ్ రావు

జమ్మూ కశ్మీర్లో ఉగ్రమూకలు పర్యాటకులను హతమార్చిన విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు X ద్వారా వెల్లడించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వేడుకున్నట్లు చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
News April 23, 2025
ఇంటర్ ఫెయిల్.. సివిల్స్ ర్యాంకర్

AP: పరీక్షల్లో ఫెయిలయ్యామంటే చాలు కొంతమంది తమ కథ ముగిసిందని చదువు ఆపేయడమో లేదా జీవితాన్నే ముగించడమో చేస్తుంటారు. అయితే తిరుపతికి చెందిన సురేశ్ మాత్రం ఇంటర్లో ఫెయిలయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందలేదు. తన విధిరాతను ఎదుర్కొన్నాడు. సంకల్ప దీక్షతో చదివాడు. భారతదేశంలోనే అత్యున్నత పరీక్షగా భావించే సివిల్ సర్వీస్ సాధించాడు. జాతీయ స్థాయిలో 988వ ర్యాంకు సాధించి కృషి ఉంటే అసాధ్యమేదీ లేదని నిరూపించాడు.
News April 23, 2025
NGKL: 60 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

నాగర్కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు SLBC సొరంగంలో కార్మికులు చిక్కుకొని నేటికీ 60 రోజులు అవుతోంది. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు చేపట్టిన సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 12 కంపెనీలకు చెందిన 700మంది సిబ్బంది సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు. అయినప్పటికీ అందులో చిక్కుకున్న ఆరుగురి ఆచూకీ నేటికీ లభించలేదు. ఈనెల 24న సహాయక చర్యలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.