News March 10, 2025

యాదాద్రి శ్రీవారి రథోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

image

యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మధుర ఘట్టమైన దివ్య విమాన రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతురావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రముఖ సినీ గాయకురాలు గీతా మాధురి భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు,ఛైర్మన్ నరసింహమూర్తి దంపతులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Similar News

News November 15, 2025

ప్రణాళిక ప్రకారం నిర్వహించాలి: MHBD కలెక్టర్

image

ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని, ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా కేంద్రాలను, వసతి గృహాలను పరిశీలించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. జిల్లా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై కలెక్టర్ శుక్రవారం వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News November 15, 2025

కామారెడ్డి: ఆన్‌లైన్ టాస్క్‌ల పేరుతో రూ.2.74 లక్షల టోకరా

image

టెలిగ్రామ్‌లో వచ్చిన లింకును ఓపెన్ చేసి దోమకొండకు చెందిన వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యారు. ‘గుబిభో’ అనే యాప్‌లో టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని నమ్మించారు. కొన్ని టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు క్రెడిట్ అయినట్లు స్క్రీన్ షాట్‌లు చూపించారు. డబ్బు ఖాతాలోకి బదిలీ చేసుకోవాలంటే కొంత మొత్తం చెల్లించాలని సూచించారు. దీంతో బాధితుడు రూ.2.74 లక్షలు పంపించాడు. మోసపోయానని గ్రహించి PSను ఆశ్రయించాడు.

News November 15, 2025

పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఆమె సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల అధ్యయన పద్ధతులు, బోధనా ప్రమాణాల మెరుగుదలపై కలెక్టర్ మార్గదర్శకాలు ఇచ్చారు.