News February 16, 2025
యాదాద్రి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళాయే!

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. 1న విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభం కాగా 2న ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, 3 నుంచి అలంకరణ సేవలు, 7న స్వామివారి ఎదుర్కోళ్ల మహోత్సవం, 8న తిరు కళ్యాణ మహోత్సవం, 9న దివ్య విమాన రథోత్సవం, 10న చక్ర తీర్థం, 11న శతఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి.
Similar News
News November 19, 2025
జీపీ ఎన్నికలు.. ఉమ్మడి పాలమూరులో బీసీ స్థానాలపై ఆసక్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తర్వాత, ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించగా, ఉమ్మడి పాలమూరులో 704 జీపీలలో బీసీలు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఉంది. డిసెంబర్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో ఆశావహులు తమ సన్నాహాలను మొదలుపెట్టారు.
News November 19, 2025
ములుగు: పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు!

ములుగు జిల్లాలో రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నవంబర్ మొదటి వారంలో 30 సెంటీగ్రేట్లకు పైగా ఉష్ణోగ్రత నమోదు కాగా.. ప్రస్తుతం జిల్లాలో అత్యల్పంగా 11 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు చలి తీవ్రతలు ఎదుర్కొనేందుకు తగు సంరక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News November 19, 2025
నెల్లూరులో చిక్కనంటున్న.. ఆకుకూరలు

మార్కెట్లో ఆకుకూరల ధరలు ఆకాశానంటుతున్నాయి. రూ. 20కి తోటకూర 3, చిర్రాకు 3, గోంగూర 3 కట్టలు ఇస్తున్నారు. గతంలో ఈ ధరకు రెట్టింపు ఇచ్చేవారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు తోటలు దెబ్బతిని ఉత్పత్తి తగ్గింది. ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకువడంతో ధరలు అమాంతం పెరిగాయి. వీటితోపాటు కూరగాయల ధరలు సైతం మండుతున్నాయి. దీంతో సామాన్యుడు జేబుకు చిల్లుపడుతోంది.


