News September 29, 2024

యాదాద్రి శ్రీవారి విమాన గోపురానికి స్వర్ణతాపడం

image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం పనులు దసరా పండుగ నాటి నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వర్ణ తాపడం పనులను స్మార్ట్ క్రియేషన్స్ వారికి అప్పగించారు. ఈ పనులను వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయనున్నారు.

Similar News

News October 22, 2025

నల్గొండ: మైనర్‌ బాలిక కేసులో నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్ష

image

మైనర్ బాలికను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకొని, అత్యాచారం చేసిన కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు గురజాల చందుకు ఏకకాలంలో మొత్తం 32 ఏళ్ల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

News October 22, 2025

అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

నల్గొండ జిల్లాలోని వెటర్నరీ & అనిమల్ హస్బెస్టరీ, ఫిషరీష్ డిపార్ట్మెంట్ లలో డేటాఎంట్రీ ఆపరేటర్స్ (3), ఆఫీస్ సబార్డినేట్స్ (38) పోస్టులకు అవుట్సోర్సింగ్ సేవలను అందించటానికి ఎమ్ పానెల్ అయిన ఆసక్తి గల అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

News October 22, 2025

కొండమల్లేపల్లి: ఆదుకుంటే.. చదువుకుంటాం..

image

కొండమల్లేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రోజువారీ కూలీలైన సైదమ్మ-వెంకటయ్య కుమార్తెలు ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కూతురు తేజశ్రీకి రామగుండంలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఏడాది ఫీజు ₹ 1,22,000 కాగా, ఆమె అక్కకు ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం ఫీజు ₹ 1,88,000 చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఇద్దరూ ప్రస్తుతం కూలి పనులకు వెళ్తున్నారు. దాతలు ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.