News January 28, 2025
యానం పురపాలక సంఘంలో నలుగురు ఉద్యోగులపై వేటు

కేంద్రపాలిత ప్రాంతమైన యానం పురపాలక సంఘంలో పనిచేస్తున్న నలుగురు బిల్ కలెక్టర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. యానంలోని రిక్రియేషన్ క్లబ్బులకు ట్రేడ్ లైసెన్సుల మంజూరు వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన పుదుచ్చేరి పట్టణ అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ సౌందర్యరాజన్ వారిపై చర్యలకు ఆదేశించారు. ఒకేసారి నలుగురు ఉద్యోగులు సస్పెండ్ కావడం యానంలో కలకలం రేపుతోంది.
Similar News
News February 18, 2025
పరీక్ష లేకుండా 21,413 ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. APలో 1,215, TGలో 519 ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి పరీక్ష లేకుండా టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు చేపడతారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ శాలరీ నెలకు రూ.12,000-రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జీతం రూ.10,000-రూ.24,470 వరకు ఉంటుంది. చివరి తేదీ: మార్చి 3. indiapostgdsonline.gov.in
News February 18, 2025
రాష్ట్ర వ్యాప్తంగా వేములవాడ జాతర వాల్ పోస్టర్ల ప్రదర్శన

వేములవాడ రాజన్న సన్నిధిలో జరిగే మహాశివరాత్రి జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల వద్ద వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ సిబ్బంది అతికిస్తున్నారు. ఈనెల 25 నుంచి 27 గురువారం వరకు మూడు రోజులపాటు వేములవాడలో మహా శివరాత్రి జాతర జరుగుతుందన్నారు. పూజల వివరాలు, సమయాలతో కూడిన పూర్తి వివరాలతో వాల్ పోస్టర్లను రూపొందించామని తెలిపారు.
News February 18, 2025
ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించం: మంత్రి డీబీవీ స్వామి

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించబోమని, అవసరం అయితే కొత్త నియామకాలు చేపడతామని మంత్రి డీబీవీ స్వామి స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియపై పలు సమీక్షలు నిర్వహించి జనాభా ప్రాతిపదికన A, B, C క్యాటగిరీలుగా వారిని నియమించాలని నిర్ణయించామన్నారు. పదోన్నతులు, మిగిలిపోయిన ప్రొబేషన్ డిక్లరేషన్, జీతం స్కేలుపై ఉన్నతాధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.