News March 6, 2025

యువకుడి ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు: ఎస్ఐ

image

కొయ్యూరు మండలం బకులూరు పంచాయతీ నెల్లిపూడి గ్రామానికి చెందిన పొట్టిక రాము(24) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖాళీగా తిరుగుతున్నాడని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన రాము ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రాజుబాబు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పీ.కిషోర్ వర్మ బుధవారం తెలిపారు.

Similar News

News November 22, 2025

హనుమకొండ: ‘ఆర్టీఐ కమిషన్ వద్ద 18 వేల పెండింగ్ దరఖాస్తులు’

image

రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ వద్ద సుమారు 18 వేల సెకండ్ అప్పీల్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర సమాచార కమిషనర్ అయోధ్యరెడ్డి అన్నారు. నేడు జిల్లాకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లుగా ఆర్టీఏ కమిషన్ లేదని, అందువల్ల పెండింగ్‌లు పెరిగిపోయాయని తెలిపారు. ఐదు నెలల కాలంలో సుమారు 5 వేలకు పైగా దరఖాస్తులు పరిష్కరించామని, రాష్ట్రంలోని 17జిల్లాల్లో జీరో పెండింగ్ ఉండే విధంగా చేశామన్నారు.

News November 22, 2025

హనుమకొండ: ‘ఆర్టీఐ కమిషన్ వద్ద 18 వేల పెండింగ్ దరఖాస్తులు’

image

రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ వద్ద సుమారు 18 వేల సెకండ్ అప్పీల్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర సమాచార కమిషనర్ అయోధ్యరెడ్డి అన్నారు. నేడు జిల్లాకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండున్నరేళ్లుగా ఆర్టీఏ కమిషన్ లేదని, అందువల్ల పెండింగ్‌లు పెరిగిపోయాయని తెలిపారు. ఐదు నెలల కాలంలో సుమారు 5 వేలకు పైగా దరఖాస్తులు పరిష్కరించామని, రాష్ట్రంలోని 17జిల్లాల్లో జీరో పెండింగ్ ఉండే విధంగా చేశామన్నారు.

News November 22, 2025

త్వరలో లెక్చరర్ పోస్టుల భర్తీ: లోకేశ్

image

AP: వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, త్వరలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో భేటీలో ఈమేరకు హామీ ఇచ్చారు. కాలేజీలు, వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామన్నారు.