News March 20, 2025

యువకుడి ప్రాణం తీసిన బెట్టింగ్

image

బెట్టింగ్ ఊబిలో పడి అప్పు మీద అప్పు చేసి, తీర్చేందుకు స్తోమత లేక.. చివరికి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొలిమిగుండ్ల మండలం గోర్విమానుపల్లెకు చెందిన మహేంద్ర(28) గుత్తి రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మహేంద్ర గతంలో వాలంటీర్‌గా పనిచేసి, ప్రస్తుతం పెన్నా సిమెంట్‌లో పనిచేస్తున్నాడు.

Similar News

News November 14, 2025

కామారెడ్డిలో చిల్డ్రన్స్ డే స్పెషల్ ‘కిడ్స్ విత్ ఖాకీ’

image

కామారెడ్డి జిల్లా పోలీస్‌ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా ‘కిడ్స్ విత్ ఖాకీ’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 9:30 గంటలకు నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ స్కిట్‌, అనంతరం 10:30 గంటలకు ట్రాఫిక్‌ ప్లెడ్జ్‌, అలాగే విద్యార్థులకు పోలీస్‌ స్టేషన్లలో జరిగే విధి విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.

News November 14, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 14, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 14, 2025

వరంగల్: 24 అంతస్తుల్లో హాస్పిటలే ఉంటుంది: డీఎంఈ

image

వరంగల్‌లో నిర్మిస్తున్న 24 అంతస్తుల్లో త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తామని డీఎంఈ డా.నరేంద్ర కుమార్ తెలిపారు. ఆసుపత్రికి బదులుగా ఐటీ హబ్ అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, త్వరలోనే సనత్ నగర్ టిమ్స్, వరంగల్ 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రారంభించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.