News March 20, 2025
యువకుడి ప్రాణం తీసిన బెట్టింగ్

బెట్టింగ్ ఊబిలో పడి అప్పు మీద అప్పు చేసి, తీర్చేందుకు స్తోమత లేక.. చివరికి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొలిమిగుండ్ల మండలం గోర్విమానుపల్లెకు చెందిన మహేంద్ర(28) గుత్తి రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగానే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మహేంద్ర గతంలో వాలంటీర్గా పనిచేసి, ప్రస్తుతం పెన్నా సిమెంట్లో పనిచేస్తున్నాడు.
Similar News
News January 4, 2026
నయా ట్రెండ్.. పెద్ద టైటిళ్లు అయితేనేం!

టాలీవుడ్లో పెద్ద టైటిళ్ల హవా కన్పిస్తోంది. క్యాచీగా ఉంటే చాలూ సినిమా పేరు పెద్దదైనా పర్లేదంటున్నారు మేకర్లు. ఈ సంక్రాంతి బరిలో నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘నారీ నారీ నడుమ మురారీ’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ కోవలోవే. అందులోనూ అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా ఉన్నాయి. అటు వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్(ఆదర్శ కుటుంబం హౌస్ నం.47) కూడా లెంగ్తీదే కావడం విశేషం.
News January 4, 2026
రూ.2.46 లక్షలు రికవరీ చేసిన గద్వాల్ పోలీసులు

సైబర్ మోసాలకు గురైన బాధితులకు గద్వాల్ జిల్లా పోలీసులు అండగా నిలిచారు. వివిధ కేసుల్లో పోగొట్టుకున్న రూ.2.46 లక్షలను రికవరీ చేసి బాధితులకు రిఫండ్ చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మల్దకల్ పీఎస్ పరిధిలో ఓ బాధితురాలు కోల్పోయిన రూ. 1.80 లక్షల్లో, లక్ష రూపాయలను విజయవంతంగా తిరిగి ఇప్పించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.
News January 4, 2026
వైకుంఠద్వార దర్శనం: తిరుమల UPDATE

AP: తిరుమల వేంకటేశ్వరుడిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం 9pm వరకు కొండపై భక్తుల రద్దీ గురించి TTD అప్డేట్ ఇచ్చింది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నట్లు చెప్పింది. శ్రీవారి దర్శనానికి 16గంటల వరకు టైం పడుతున్నట్లు చెప్పింది. అటు భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో స్వామివారి అభిషేకం సమయంలోనూ దర్శనం కల్పించాలని TTD నిర్ణయించింది.


