News March 25, 2025
యువకుడి ప్రాణాలు తీసిన డేటింగ్ యాప్

మణుగూరు మండలంలో సోమవారం<<15868447>> ఉరివేసుకుని యువకుడు<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వాసవీనగర్కి చెందిన సుగ్గుల కార్తీక్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. డేటింగ్ ఫ్రెండ్ యాప్లో ఓ యువతితో పరిచయం పెంచుకుని ప్రేమించాడు. చివరకు ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. తండ్రి సుదర్శన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 18, 2025
గుంటూరు: సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

దీపావళి పండుగ సందర్భంగా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం లేదని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శనివారం తెలిపారు. దీపావళి సందర్భంగా సెలవు దినం కావడంతో పీజీఆర్ఎస్ జరగదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వ్యయ ప్రయాసలతో కలెక్టరేట్కు రావద్దని కలెక్టర్ సూచించారు.
News October 18, 2025
NLG: టెండర్ల జాతర.. ఒక్క షాపుకే 100 దరఖాస్తులు !

ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇవాళ చివరి రోజు కావడంతో ఉదయం నుంచే ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లాలో 329 షాపులకు టెండర్లు స్వీకరిస్తున్నారు. అయితే నల్గొండ జిల్లా ధర్వేశిపురం వైన్స్ కోసం 100కు పైగా టెండర్లు దాఖలైనట్లు సమాచారం. నేడు బంద్ కారణంగా కొంత ఇబ్బంది కలిగినప్పటికీ DDలు తీసి ఉంటే రాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News October 18, 2025
అఫ్గాన్ నుంచి టిప్స్ తీసుకోండి.. BCCI, కేంద్రంపై శివసేన ఫైర్!

పాక్ దాడుల్లో క్రికెటర్ల మృతితో ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు అఫ్గాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో Asia Cupలో పాక్తో టీమ్ ఇండియా ఆడటాన్ని గుర్తు చేస్తూ శివసేన(UBT) ఫైర్ అయింది. క్రీడల కంటే దేశానికి ప్రాధాన్యం ఇచ్చే విషయంలో Afghan నుంచి BCCI, కేంద్రం టిప్స్ తీసుకోవాలని మండిపడింది. PAKతో సిరీస్ను Afghan రద్దు చేసుకోవడం ఆనందం కలిగించిందని ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేది ట్వీట్ చేశారు.