News April 9, 2025
యువకుడి హత్య కేసు ఛేదించిన పోలీసులు

ధనశ్రీ గ్రామంలో యువకుడు మహమ్మద్ అబ్బాస్ అలీ (25) హత్య కేసులో నిందితులు ఖలీల్ షా, మమ్మద్ బిస్త్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖలీల్ తన తల్లిని వేధిస్తున్నాడని అబ్బాస్ హెచ్చరించడంతో అతన్ని కత్తులతో హత్య చేశారు. అడ్డుగా వచ్చిన షేక్ అక్బర్ అలీపై బీర్ బాటిల్తో దాడి చేశారన్నారు. తర్వాత ఓ బైక్ను అపహరించి పారిపోయారు. జూన్ 8న నిందితులు పట్టుబడ్డారు. కేసులో కీలకంగా పనిచేసిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.
Similar News
News October 16, 2025
KMR: వైన్ షాపులరకు పోటాపోటీ దరఖాస్తులు

కామారెడ్డి జిల్లాలో 49 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం బుధవారం వరకు మొత్తం 267 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు బుధవారం తెలిపారు. దరఖాస్తుల వివరాలు..
కామారెడ్డి: 15 షాపులకు 63 దరఖాస్తులు
బాన్సువాడ: 9 షాపులకు 59 దరఖాస్తులు
బిచ్కుంద: 10 షాపులకు 60 దరఖాస్తులు
దోమకొండ: 8 షాపులకు 44 దరఖాస్తులు
ఎల్లారెడ్డి: 7 షాపులకు 41 దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు.
News October 16, 2025
పాక్-అఫ్గాన్ మధ్య సీజ్ ఫైర్.. ట్రంప్పై సెటైర్లు!

పాకిస్థాన్-అఫ్గాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతా US అధ్యక్షుడు ట్రంప్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘ఇప్పటికే 8 యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్న ఆయన ఇంకా ఈ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోలేదా?’ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ‘ఆయన ఆ మాట చెప్పగానే నోబెల్కి మరోసారి నామినేట్ చేసేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ సిద్ధంగా ఉన్నారు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
News October 16, 2025
ASF: ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు

ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని ASF జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ అన్నారు. బుధవారం జన్కాపూర్ సబ్ జైలు అధికారులతో సమావేశం నిర్వహించారు. జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వారి ఆరోగ్య వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.