News October 6, 2024
యువతకు ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాలి: అనిత

మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో నూతన ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మంతెన రాంబాబు (రామ)రాజుని హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని అనిత కోరారు.
Similar News
News December 16, 2025
గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యారావు?

గుంటూరు జిల్లా TDP అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యారావు పేరు అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (LIDCAP) చైర్మన్గా పనిచేస్తున్నారు.
News December 16, 2025
GNT: గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు అరెస్ట్

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గంజాయి మూలాలను కూకటివేళ్లతో పెకలించి వేస్తున్నామని DSP అబ్దుల్ అజీజ్ అన్నారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతీనగర్ అబ్దుల్ బాబా మసీదు ఎదురు ఖాళీస్థలంలో ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు. పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేయగా కేసు వివరాలను DSP వివరించారు. వారి వద్ద నుంచి 20గ్రాముల గంజాయి, 4 గ్రాముల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
News December 16, 2025
GNT: మృతదేహాల తరలింపులోనూ వసూళ్ల దందా.!

ఎంతో ఘన చరిత్ర ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహాప్రస్థానం వాహనాల డ్రైవర్లు వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. మృతదేహాన్ని ఉచితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన మహాప్రస్థానం వాహన డ్రైవర్లు దూరాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రాణం కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబాలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు.


