News January 30, 2025
యువతకు ఉపాధి కల్పించాలి: ASF కలెక్టర్

జిల్లాలోని నిరుద్యోగ యువతకు పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో ఉపాధి కల్పన కొరకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజే ఆఫ్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి కమిటీ సమీక్ష నిర్వహించారు.
Similar News
News December 1, 2025
పాతబస్తీలో అండర్గ్రౌండ్ సర్జరీ!

మెట్రో రైలు ఫేజ్-II (MGBS-చాంద్రాయణగుట్ట) కారిడార్లో పాతబస్తీకి శాశ్వత పరిష్కారం దక్కనుంది. కేవలం ఆరు నెలల్లోనే రూ.39.6 కోట్లతో కీలక జల వసతి పనులు పూర్తి చేయాలని HMWSSB నిర్ణయించింది. మైసారం, అలియాబాద్, మిస్రిగంజ్, దారుల్షిఫా, మొఘల్పురా, జంగంమెట్, గౌలిపురా, ఎంఆర్జీ ప్రాంతాల మీదుగా ఉన్న 100-1200 mm డయా తాగునీరు, డ్రైనేజీ లైన్లను మెట్రో పిల్లర్ల మార్గం నుంచి పూర్తిస్థాయిలో మార్చనున్నారు.
News December 1, 2025
విధులకు గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు: కలెక్టర్

విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ప్రజా వేదికకొచ్చే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాటిపై అవగాహన పెంచుకోవాలని అధికారులకు సూచించారు.
News December 1, 2025
అఫ్గాన్తో ట్రేడ్ వార్.. నష్టపోతున్న పాక్

అఫ్గాన్తో ట్రేడ్ వార్ పాక్ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఆ దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆపేయడంతో పాక్లోని సిమెంట్ ఇండస్ట్రీ నష్టపోతోంది. అఫ్గాన్ నుంచి కోల్ దిగుమతి లేకపోవడంతో సౌతాఫ్రికా, ఇండోనేషియా, మొజాంబిక్ నుంచి అధిక ధరలకు సిమెంట్ ఫ్యాక్టరీలు బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాయి. 48 రోజుల నుంచి బార్డర్లు క్లోజ్ కావడంతో మందులు, అగ్రికల్చర్ గూడ్స్తోపాటు పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయి.


