News September 25, 2024
యువతకు ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో డిమాండ్కు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచి ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో యువతకు స్కిల్ డెవలప్ మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి కల్పనతో పాటు కులవృత్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Similar News
News February 25, 2026
KNR: ‘విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలి’

వచ్చే నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆకాంక్షించారు. కొత్తపల్లి మండలం చింతకుంట జడ్పీ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల నమూనా పరీక్ష పత్రాలను పరిశీలించి, వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలన్నారు.
News February 25, 2026
‘కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదు’

కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
News February 25, 2026
‘కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదు’

కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.


