News March 13, 2025
యువతలో ఎఐ నైపుణ్యాకు మైక్రో సాఫ్ట్తో కీలక ఒప్పందం

రాష్ట్రంలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఎఐ), అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం అంతర్జాతీయస్థాయి ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్తో ఎపి ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు గురువారం విజయవాడ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు.
Similar News
News March 13, 2026
బాపట్ల: అనుమానంతో పెళ్లి నిరాకరణ.. తల్లీకూతురి ఆత్మహత్య

మార్టూరు మండలం ద్రోణాదులలో తల్లీకూతుళ్లు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం కలిగించింది. సిరికొండ దివ్యకు మార్టూరుకు చెందిన రావులకొల్లు శేషుబాబుతో గతేడాది డిసెంబర్ 14న ఎంగేజ్మెంట్ జరిగింది. దివ్యను అనుమానించిన శేషుబాబు పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన తల్లీకూతుర్లు దివ్య, సుజాత ఈనెల 4న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గుంటూరులో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు.
News March 13, 2026
దేశంలోనే భద్రాద్రి టాప్..!

దేశంలోనే అత్యధికంగా భద్రాద్రి పోలీసులు ఏడాది కాలంలో 6500 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పట్టుబడిన నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలో జరిగిన అవేర్నెస్ ప్రోగ్రాంలో మాట్లాడారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని, ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరాలన్నారు.
News March 13, 2026
ధోనీ ఆ స్థానాల్లో బ్యాటింగ్ చేయడం కరెక్ట్ కాదు: పుజారా

CSK మాజీ కెప్టెన్ ధోనీ 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్కు రావడం కరెక్ట్ కాదని మాజీ క్రికెటర్ పుజారా అన్నారు. ‘ధోనీ ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించగలడు. కేవలం 5 లేదా10 కాకుండా 25-30 బంతులు ఆడితే జట్టుకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఆయన ముందుగా బ్యాటింగ్కు వస్తే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది’ అని అభిప్రాయపడ్డారు. 44 ఏళ్ల ధోనీ గత సీజన్లో 8, 9 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే.


