News February 5, 2025
యువతిని బెదిరించి డబ్బులు వసూలు.. నిందితుడు అరెస్ట్

నగ్న వీడియోలు బయటపెడతానని నిడదవోలుకు చెందిన యువతిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. మంగళవారం కొవ్వూరులో మీడియాతో మాట్లాడారు. నిందితుడు రూ.2కోట్ల 53 లక్షలు వసూలు చేశాడని చెప్పారు. నిందితుడికి చెందిన రూ.కోటి 81 లక్షల విలువ గల ఆస్తులు సీజ్ చేసినట్లు తెలిపారు. కాగా నిందితుడి ఫోన్లో ఎటువంటి వీడియోలు లభ్యం కాలేదన్నారు.
Similar News
News December 5, 2025
చింతలపాలెంలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

చింతలపాలెం మండలంలోని నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శుక్రవారం పరిశీలించారు. చింతలపాలెం, దొండపాడు, మేళ్లచెర్వు, రామాపురం పంచాయతీల్లోని సర్పంచ్-వార్డు సభ్యుల నామినేషన్ కేంద్రాలను ఆయన సందర్శించారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఆర్.ఓ.లకు సూచించారు. సందేహాలున్నవారు హెల్ప్డెస్క్ను వినియోగించుకోవాలన్నారు.
News December 5, 2025
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన సీఎం నితీశ్

బిహార్ CM నితీశ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఇటీవల పదోసారి CMగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(లండన్)లో చేరినట్లు JDU తెలిపింది. 2000లో తొలిసారి CM అయిన నితీశ్ వారం రోజులే పదవిలో ఉన్నారు. తర్వాత 2005 నుంచి వరుసగా 5సార్లు సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేసి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు.
News December 5, 2025
KMR: మూడు నెలలుగా వేతనాలు అందట్లేదని DMHOకు వినతి

కామారెడ్డి జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు అందలేదని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.విద్యకు వినతిపత్రం అందజేశారు. వేతనాలు రాకపోవడంతో ఇళ్లల్లో భారం ఏర్పడి, జీవితాలు కొనసాగించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతినెల 1వ తేదీన వేతనాలు అందేలా ఉన్నతాధికారులకు నివేదించాలని కోరారు.


